మంజీరా తీరం కోనసీమను తలపిస్తున్నదని, మండుటెండల్లోనూ నదిపై చెక్డ్యామ్లు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. కౌడిపల్లి మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మెదక్ జిల్లా ఇన్చార్జి యెగ్గె మల్లేశంతో కలిసి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతు సంక్షేమానికి పెద్దపీట వేసి రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24గంటల ఉచిత కరెంట్ సరఫరా చేస్తుండడంతో రైతులు రాజులుగా మారుతున్నారన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా అందజేస్తున్న రూ.లక్ష నూటపదహార్లతో ఎంతోమంది పేద బిడ్డల పెండ్లిళ్లు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. పల్లె ప్రగతితో పంచాయతీలు నందనవనాలుగా మారాయన్నారు. పంజాబ్, కేరళ, ఢిల్లీలు కంటి వెలుగును తమ రాష్ర్టాల్లో అమలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాష్ర్టానికి నిధుల కేటాయింపుల్లో వివక్ష చూపిస్తున్నదని, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్కు అన్ని రాష్ర్టాల్లో ఆదరణ పెరుగుతున్నదని, రాబోయే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
– కౌడిపల్లి, ఏప్రిల్ 15
కౌడిపల్లి, ఏప్రిల్ 15: “సీఎం కేసీఆర్ పాలనలో రైతులు రాజులుగా మారుతున్నారు. కుల వృత్తులకు పునరుజ్జీవంతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారు. మంజీరా తీరం వెంట ఉన్న పల్లెలు కోనసీమను తలపించేలా ఉన్నాయి. సీఎం కేసీఆర్ పాలన స్వర్ణయుగంలా ఉన్నది..” అని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. శనివారం కౌడిపల్లి లక్ష్మీనర్సింహ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సార రామాగౌడ్ అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి మెదక్ జిల్లా ఆత్మీయ సమ్మేళనం ఇన్చార్జి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ 14 ఏండ్ల పోరాటంలో ఎన్నో అనుభవాలు చూసిన కేసీఆర్ సీఎంగా 2014లో అధికారం చేపట్టిన తర్వాత రైతు సంక్షేమానికి పెద్దపీట వేశాడన్నారు. 24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాల అమలుతో రైతులు రాజులుగా మారుతున్నారన్నారు. దేశానికే తలమానికంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని, సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తుందన్నారు. ఆడబిడ్డల పెండ్లిళ్ల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా రూ.1,00,116 అందజేస్తున్నారని తెలిపారు.
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి : ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం
ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రం సాధించిన ఉద్యమకారుడు, సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం అన్నారు. రైతులకు ఉచిత కరెంటు, రైతులు పంటలు పండించడానికి పంట పెట్టుబడి సాయం ఇస్తున్నాడన్నారు. పేదలు ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకుంటే జీవో 58, 59 కింద క్రమబద్ధీకరించేందుకు అవకాశం ఇచ్చిన మహనీయుడని, నాకు అత్యంత ఆప్తుడైన ఎమ్మెల్యే మదన్రెడ్డి సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడని తెలిపారు. సీఎం సహకారంతో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నాడని, వచ్చే ఎన్నికల్లో లక్ష మెజార్టీతో మదనన్నను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్కు ఇతర రాష్ర్టాల్లోనూ ఆదరణ పెరుగుతున్నదని, రానున్న ఎన్నికల్లో రాష్ట్రంతో పాటు దేశంలో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తుందన్నారు. బీజేపీ ప్రజలను అయోమయానికి గురి చేస్తుందని, ప్రధాని మోదీ లక్ష కోట్లు అప్పులు తెచ్చి తెలంగాణకు ఏం చేసిండని ప్రశ్నించారు.
మండుటెండల్లోనూ నిండుకుండలా..
నర్సాపూర్ నియోజకవర్గంలో 52 కిలోమీటర్లు మంజీరానది ప్రవహిస్తుండగా, 14 చెక్డ్యాంల నిర్మాణంతో మండుటెండల్లో సైతం నిండుకుండలా మారిందని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. భూగర్భజలాలు పెరిగి, మంజీరాతీర గ్రామాలు కోనసీమను తలపిస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతితో అన్ని గ్రామాలు నందనవనాలుగా మారాయని, కేంద్రం ప్రకటించిన ఉత్తమ పంచాయతీ అవార్డుల్లో తెలంగాణలోని 19 జిల్లాలకు రావడమే నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. ఇతర రాష్ర్టాల్లోనూ ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు. రాష్ర్టానికి నిధుల కేటాయింపుల్లో కేంద్రం మోకాలడ్డు పెట్టి రాష్ట్ర అభివృద్ధికి అడ్డుగా నిలిచిందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతువ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదన్నారు. రైతులకు 24 గంటల కరెంటు ఇస్తుండడంతో ఓర్వలేని కేంద్రం ఉచిత కరెంటును నిలిపివేస్తే రాష్ర్టానికి రూ.30 వేల కోట్లు ఇస్తానని చెప్పగా, సీఎంకేసీఆర్ రైతుల సంక్షేమం కోసం కేంద్రం నిర్ణయాన్ని తిరస్కరించినట్లు తెలిపారు.
కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెట్టినా సీఎం కేసీఆర్ రైతుల నుంచి వరిధాన్యం కొనుగోలుసి, డబ్బులు రైతుల ఖాతాల్లో వేస్తున్నాడన్నారు. తెలంగాణలో కులవృత్తుల పునరుజ్జీవనం వచ్చిందన్నారు. కాళేశ్వరంతో నియోజకవర్గంలోని ప్రతి చెరువు నింపడం ద్వారా ప్రతి ఎకరాకు నీరందుతున్నదన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు చేసినట్లు అందులో భాగంగా నర్సాపూర్ తాలూకాను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందజేస్తున్నారని, దళితుల బాగు కోసం దళితబంధు పథకాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అత్యంత ఎత్తైన విగ్రహాన్ని తెలంగాణలోనే సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసి తన దార్శనికతను చాటుకున్నాడన్నారు. ఎల్లవేళలా పార్టీ కార్యకర్తలకు అండగా ఉండేది బీఆర్ఎస్ అన్నారు. ఇంత బిజీగా ఉండి కూడా ప్రతి మండలంలో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి కార్యకర్తలతో కలిసి భోజనం చేయడం సంతోషంగా ఉందన్నారు.
సీఎం కేసీఆర్ కార్యకర్తల్లో భరోసా నింపడానికే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. పార్టీకి కార్యకర్తలు పునాదులని, పునాదులు కనిపించవన్నారు. కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. డబుల్బెడ్రూం ఇండ్ల విషయంలో స్థలాల కొరత ఉండడంతో వచ్చే నెల నుంచి గృహలక్ష్మి పథకం కింద రూ.మూడు లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జిల్లా పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడు మన్సూర్ అహ్మద్, ఎంపీపీ రాజు నాయక్, జడ్పీటీసీ కవిత అమర్సింగ్, ఆత్మ కమిటీ చైర్మన్లు ప్రతాప్రెడ్డి, గొర్రె వెంకట్రెడ్డి, మాజీ ఎంపీపీ పద్మానర్సింహారెడ్డి, సీడీసీ మాజీ చైర్మన్ దుర్గారెడ్డి, సర్పంచ్లు బాన్సువాడ మహిపాల్రెడ్డి, పద్మాకిష్టయ్య, వనజాశ్యాంసుందర్రాజు, కాంతారావు, నర్సింగ్రావు, నరహరి, సుధాకర్, ఎల్లం, సంజీవులు, కుర్మ శేకులు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గుంజరి ప్రవీణ్కుమార్, ఎంపీటీసీలు స్వప్నా కిశోర్గౌడ్, శివయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వాకిటి శశిధర్రెడ్డి, సొసైటీ వైస్చైర్మన్ చిన్న చిన్నంరెడ్డి, బీఆర్ఎస్ మండల నాయకులు రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చేస్తున్న సేవలే మూడోసారి గెలిపిస్తాయి : కౌడిపల్లి వైస్ ఎంపీపీ నవీన్గుప్తా
ప్రజలకు అందించిన సేవలే, ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే మదన్రెడ్డిని భారీ మెజర్టీతో గెలిపిస్తాయని కౌడిపల్లి వైస్ ఎంపీపీ నవీన్గుప్తా అన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని అన్ని గిరిజన తండాలకు రూ.55 కోట్లతో సీసీ రోడ్లు నిర్మించారని, మండలంలోని అన్ని తండాల్లోని లింకు రోడ్ల నిర్మాణానికి బీటీ రోడ్లు రూ.86 కోట్లు మంజూరయ్యాయన్నారు. అలాగే, 126 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్ దళితుల పక్షపాతిగా నిలిచారన్నారు.
సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు : డీసీసీబీ డైరెక్టర్ బాన్సువాడ గోవర్ధన్రెడ్డి
వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతుబీమా పథకాలు అమలు చేస్తున్న రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని డీసీసీబీ బాన్సువాడ గోవర్ధన్రెడ్డి అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించినా, సీఎం కేసీఆర్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. ఎడారిగా మారిన భూములను సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడని కొనియాడారు.
మీ గెలుపును మా భుజస్కంధాలపై వేసుకుంటాం : బీఆర్ఎస్ మండల యువత అధ్యక్షుడు కృష్ణాగౌడ్
కౌడిపల్లి మండలంలో ఎమ్మెల్యే మదన్రెడ్డి కోసం బీఆర్ఎస్ యువత కష్టపడుతామని, మీ గెలుపును మా భుజస్కంధాలపై వేసుకుంటామని, మీరు ఆజ్ఞ వెస్తే బీజేపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు చంద్రం కృష్ణాగౌడ్ అన్నారు. ఆత్మీయ సమ్మేళనంలో ఉధ్వేగపూరితమైన ప్రసం గం చేయడంతో యువకులు, కార్యకర్తలు ఉత్తేజితులయ్యారు.
పండుగలా సమ్మేళనం..
కౌడిపల్లి మండల కేంద్రంలో శనివారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం పండుగ వాతావరణంలో కొనసాగింది. కౌడిపల్లిలోని బతుకమ్మ తండా సమీపంలో గిరిజనుల ఆరాధ్యదైవమైన సేవాలాల్ దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భూమిపూజ చేశారు. అనంతరం ర్యాలీని ప్రారంభించారు. వారికి సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు చిలుముల వెంకటేశ్వర్రెడ్డి ఘనస్వాగతం పలుకగా, అక్కడి నుంచి ఫంక్షన్హాల్ వరకు కిలోమీటర్ మేర భారీ ర్యాలీ సాగింది. బీఆర్ఎస్ శ్రేణులు పటాకులు కాల్చారు. ర్యాలీ పొడుగునా ఒగ్గు కళాకారుల నృత్యాలు, గిరిజన సాంప్రదాయ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.