పాపన్నపేట, జూన్ 2: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని టీజీ సీపీఎస్ ఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మంగ నరసింహులు డిమాండ్ చేశారు. మెదక్ (Medak) జిల్లా పాపన్నపేటలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూడు నెలల్లో మొత్తం డీఏలు విడుదల చేస్తామని, హెల్త్ కార్డులు ఇస్తామని, పీఆర్సీ ప్రకటిస్తామని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని హామీలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
డీఏ విషయానికొస్తే ఇప్పటికే ఐదు డీఏలు రావాల్సి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పెండింగ్ బిల్లులు సైతం క్లియర్ చేయాల్సిందిగా ఆయన కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే, న్యాయపరంగా తమకు రావాల్సిన హక్కుల కోసం ఉద్యమ పంథా చేపట్టాల్సి వస్తుందన్నారు.