సిద్దిపేట, ఆగస్టు 9: కులవృత్తులను కాపాడుకునేందుకే బీసీ కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయా న్ని, బ్యాంకుల షూరిటీ, గ్యారంటీ లేకుండా సీఎం కేసీఆర్ చొరవతో నేరుగా లబ్ధిదారులకు ఆందిస్తున్నామని ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజారాధాకృష్ణ శర్మ, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, సుడా చైర్మన్ రవీందర్రెడ్డిలతో కలిసి నారాయణరావుపేట, చిన్నకోడూరు, సిద్దిపేట అర్బన్, సిద్దిపేటరూరల్ మండలాల్లోని 200మంది లబ్ధిదారులకు చెకులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి బీసీ కులవృత్తిదారులకు చేయూత అందించాలనే ఉద్దేశంతో నాయీబ్రాహ్మణులు, రజకులకు ఫ్రీ కరెంటు, గొల్లకురుమలకు గొర్రెలపంపిణీ, నేతన్నలకు 50శాతం సబ్సిడీతో నూలు, వారు నేసిన వస్త్రాలను ప్రభుత్వ కొనుగోలు, చేనేత మిత్ర కార్యక్రమం చేపట్టామన్నారు.
మత్స్యకారుల కోసం నీటి వనరుల్లో ఉచిత చేపపిల్లలు పంపిణీ, రూ.600 కోట్లతో మత్స్యకారులకు లూనాలు, మోపెడ్ల పంపిణీ, గీత కార్మికులకు చెట్టు పన్ను, పాత బకాయిల రద్దు, సొసైటీల పునరుద్ధరణ చేశారన్నారు. ఎకడా లేనివిధంగా సిద్దిపేటలో మోడల్ దోబీఘాట్లు నిర్మించామన్నారు. సిద్దిపేట దోబీఘాట్ స్ఫూర్తితో హైదరాబాద్లో కూడా దోబీఘాట్ నిర్మించామని చెప్పారు. కుమ్మరుల అభివృద్ధి కోసం సిద్దిపేటలో రూ.2 కోట్ల 20 లక్షలతో రాష్ట్రంలోనే తొలిసారిగా ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం కోసం మట్టి కుండలు, మట్టి వంట పాత్రలు, మట్టి గ్లాసులు తదితర మట్టి పాత్రల తయారీ కోసం మోడల్ ప్రాజెక్ట్ చేపట్టామన్నారు. ప్రతిఒకరూ సిద్దిపేటలో చేపడుతున్న వినూత్న కార్యక్రమాలను చూసి ఆయా జిల్లాల్లో ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో మొత్తం 330 రెసిడెన్షియల్ సూల్స్ మాత్రమే ఉండగా ప్రస్తుతం 1012 ఏర్పాటు చేసుకున్నామని, ప్రతి ఒక మండలంలో ఒక బీసీ, ఒక ఎస్సీ, ప్రతి నియోజకవర్గానికి ఒక మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాలయాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు.
జిల్లాలో ఇప్పటికీ ఎస్సీ డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీ ఉందని, జిల్లాలో బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని, త్వరలోనే బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను సిద్దిపేటలో ఏర్పాటు చేసుకోబోతున్నామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. రూపాయి ఖర్చు లేకుండా డిగ్రీ వరకు నాణ్యమైన కార్పొరేట్ విద్యను పేద విద్యార్థులకు అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జెడ్పీ చైర్పర్సన్ రోజారాధాకృష్ణశర్మ మాట్లాడుతూ ప్రభుత్వం బీసీ కులవృత్తిదారులకు రూ.లక్ష అందించడం కులవృత్తులకు జీవంపోసే గొప్ప కార్యక్రమం. వృత్తిలో నాణ్యతను పెంచే అధునాతన యంత్రాలను కొనుగోలు చేసేందుకు ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీహరి గౌడ్, నాయకులు తుపాకుల బాల్రంగం, వంగ ప్రవీణ్రెడ్డి, ఎల్లారెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ ప్రభాకర్వర్మ, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.