రామాయంపేట, నవంబర్ 24: మతోన్మాదంతో దేశం ప్రమాదంలో పడిందని ప్రస్తుత పరిస్థితులలో దేశాన్ని రక్షించే బాధ్యత యువతరానిదేనని తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ అన్నా రు. గురువారం రామాయంపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ప్రైవేట్ కళాశాల విద్యా సంస్థల ఫ్రెషర్స్ దినోత్సవానికి హాజరైన చైర్మన్ జూలూరి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడా రు.సమాజంలో కుల మతబేధాలు లేకుంటేనే దేశం సుభిక్షంగా సుఖశాంతులతో ఉంటుందన్నారు.
ఎముకలు కుళ్లిన, వయస్సు మళ్లిన సోమరులకు నెత్తురు మండే శక్తులు నిండే యువతరమే సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. మతసామరస్యం సంపద గల రాష్ట్రం తెలంగాణ అన్నారు. మతతత్వ దురహంకారం నుంచి దేశాన్ని కాపాడే మహోద్యమం తెలంగాణ నుంచే మొదలు కాబోతున్నదని ఆయన అన్నారు. కులమతాలకతీతంగా సామరస్యంగా జీవనం గడుపుతున్న బంధాన్ని విడదీయ వద్దన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఐకమత్య జీవన విధానాన్ని ఛిద్రం చేసేందుకు జరుగుతున్న మతోన్మాద కుట్రలను యువతరమే తిప్పి కొట్టాలని నిలుపునిచ్చారు. కులమతాల ఉచ్చులో పడితే దేశం అధోగతి పాలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.యువతకు దేశభక్తి ఉండాలి తప్ప విద్వేషభక్తి ఉండకూడదన్నారు. అనేక పో రాటాలు ఉద్యమాలతో 14ఏండ్లు కష్టపడి సాధించుకున్న స్వరాష్ట్ర పునఃనిర్మాణానికి అడ్డుతగిలే అభివృద్ధి నిరోధకుల పట్ల యువతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.
విద్యార్థులు మంచి చదువులు చదివి తమ తల్లితండ్రులకు కళాశాలలకు మంచిపేరు తేవాలన్నారు. ఉన్నతమైన లక్ష్యం కోసం చదవాలన్నారు. రాష్ట్రంలోనే ఈ కళాశాలకు మంచి పేరు ఉందని, ఆ పేరును నిలబెట్టాలన్నారు. రాష్ట్రం ఏర్పాటుతోనే రాష్ట్రం అంతా తిరిగి 17 కులాలను బీసీ జాబితాలో చేర్చిన ఘనత మన సీఎం కేసీఆర్దేనని అన్నారు. చావు అంచుల వరకు వెళ్లి రాష్ర్టాన్ని సాధించుకున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు.అనంతరం జూలూరి గౌరీశంకర్ను స్నేహ కళాశాలల సంస్థల చైర్మన్ వలిశెట్టి సత్యనారాయణ శనంగా శాలువాతో సన్మానించి జ్ఙాపికను అందజేశారు. కార్యక్రమంలో లయన్సుక్లబ్ జిల్లా మాజీ గవర్నర్ సూర్యరాజ్, రామాయంపేట ఎస్సై.రాజేష్, డాక్టర్. కిషోర్రెడ్డి, కానుగంటి శ్రీనివాస్, దామోదర్రావు తదితరులు ఉన్నారు.