పుల్కల్, డిసెంబర్ 24: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి మెరుగైన పాలన అందించేందుకు ఎంతగానో కృషి చేస్తున్నదని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. ఈ సందర్భంగా ముందుగా మండల పరిధిలోని మీన్పూర్ నుంచి మీన్పూర్ తండా వరకు రూ.40 లక్షలతో బీటీ రోడ్డు పనులు ప్రారంభించి, సాగు కోసం సింగూరు ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. అక్కడ నుంచి మండల కేంద్రమైన పుల్కల్లో రూ.కోటి 56 లక్షలతో నూతనంగా నిర్మించనున్న పీహెచ్సీ భవవ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటికీ పల్లెలకు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసి అభివృద్ధి అంటే ఇలా ఉంటుందని చేసి చూపిస్తున్నారన్నారు. పట్టణ ప్రాంతాలకు ధీటుగా గ్రామీణ ప్రాంతాల రోడ్లకు మహర్దశ సంతరించుకుందన్నారు.
పుల్కల్లో నిర్మించనున్న దవాఖానతో ఇక్కడి ప్రాంతవాసులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించనున్నట్లు వివరించారు. ఈ దవాఖానకు వచ్చేందుకు కృషి చేసిన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అందోల్ ఆత్మకమిటీ చైర్మన్ యాదగిరి రెడ్డి, ఎంపీపీ చైతన్య విజయ భాస్కర్రెడ్డి, సర్పంచుల ఫోరం ఉమ్మడి మండలాధ్యక్షుడు కిష్టారెడ్డి, ఎంపీటీసీల ఫోరం ఉమ్మడి మండలాధ్యక్షుడు మాణిక్రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్ నర్సింహరెడ్డి, తహసీల్దార్లు కిష్టయ్య, స్వర్ణలత, ఎంపీడీవో మధులత, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సింగూరు గురుకుల పాఠశాల తనిఖీ
మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ సింగూరు గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ విద్యార్థులు ఉపయోగించే మరుగుదొడ్లు, వంటశాలను పరిశీలించి పరిశుభ్రంగా లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలలో నెలకొన్నపలు సమస్యలపై ఆర్డీవోతో ఫోన్లో మాట్లాడి విద్యార్థులకు మంచి భోజనం, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు.