గురుకులాల సంఖ్యను పెంచి మంచి విద్యను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేటలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ గురుకుల పేరెంట్స్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ దవాఖానల్లో వసతులు కల్పించి కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి ఐదేండ్లలోనే వ్యవసాయం, కరెంట్, సాగు, తాగునీటి సమస్యలపై దృష్టిసారించి పరిష్కరించినట్లు తెలిపారు. నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు 290 ఉన్న గురుకులాలను ముఖ్యమంత్రి కేసీఆర్ 1000కి పెంచారని గుర్తుచేశారు. సీఎం తెలంగాణను అన్నపూర్ణగా మార్చారన్నారు. గురుకులాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నామని చెప్పారు.
సిద్దిపేట, నవంబర్ 19: పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించేందుకు బీసీ, ఎస్సీ ఎస్టీ, మైనార్టీల కోసం 290 ఉన్న గురుకులాలను 1000కి పెంచిన ఘనత సీఎం కేసీఆర్దని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. అదివారం సిద్దిపేటలో నిర్వహించిన తెలంగాణ గురుకుల పేరెంట్స్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు. మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటి ఐదేండ్లలో సీఎం కేసీఆర్ వ్యవసాయం, కరెంట్, సాగు, తాగు నీటి సమస్యలను తీర్చి తెలంగాణను అన్నపూర్ణగా మార్చారన్నారు. రెండోసారి అధికారంలోకి రాగానే విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. కాంగ్రెస్ హయాంలో గురుకులాల్లో 1.50 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసించగా నేడు 6 లక్షల మంది విద్యార్థులు గురుకులాల్లో చదువుతున్నారని తెలిపారు. వేలాది మందికి ఆరోగ్యశ్రీ కింద మోకాలు చిప్ప ఆపరేషన్లు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ వాళ్లకు తెలువక మ్యానిఫెస్టోలో రాసుకున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్రెడ్డి, గురుకుల టీచర్స్ పేరెంట్స్ ఆసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.
సిద్దిపేట నియోజకవర్గం ఎల్లుపల్లి గ్రామానికి చెందిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి, పుల్లూరు గ్రామానికి చెందిన రాష్ట్ర ఓబీసీ జనరల్ సెక్రటరీ ఉడుత మల్లేశం, బజరంగదళ్ జిల్లా అధ్యక్షుడు బయ్యారం కమలాకర్ రెడ్డి, బీజేపీ సిద్దిపేట మండల సెక్రటరీ విజయ్, తీన్మర్ మల్లన్న టీమ్ జిల్లా కన్వీనర్ మోతూ సాయికుమార్, యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు రాగుల వెంకటేశం, కాంగ్రెస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు స్వప్న, పురుమాండ్ల వెంకట్రెడ్డి, అవినాష్రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, సామల్ల నరేందర్ రెడ్డి మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మంత్రి హరీశ్రావుపై అభిమానంతో ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ రూపొందించిన ‘ఉద్యమ సూర్యుడా.. వీరుడా.. నీవు మాకు ధైర్యమే.. మాకు సైన్యమే’ అనే పాటను రాహుల్ సిప్లగంజ్తో కలిసి మంత్రి ఆవిష్కరించారు.