‘మన ఊరు – మనబడి’తో మారనున్న పాఠశాలల రూపురేఖలు
ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య
నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి
నర్సాపూర్, కౌడిపల్లి, చిలిపిచెడ్ మండలాల్లోని
పాఠశాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించడంతో పాటు సమస్యలన్నీ పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ మన ఊరు – మనబడి పథకాన్ని ప్రారంభించారని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. బుధవారం నర్సాపూర్, కౌడిపల్లి, చిలిపిచెడ్ మండలాల పరిధిలోని పాఠశాలల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును బంగారుమయం చేసేందుకు ప్రభుత్వం విద్యారంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నదని, మన ఊరు-మన బడితో పాఠశాలలు రూపురేఖలు పూర్తిగా మారుతాయని తెలిపారు. పనుల నిమిత్తం నిధులు మంజూరవుతున్నాయని, వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. పేద విద్యార్థులకు ఆంగ్ల విద్యను అందించడానికి అన్ని స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నట్లు వివరించారు.
నర్సాపూర్/ కౌడిపల్లి/ చిలిపిచెడ్, మే18: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనున్నదని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పెద్దచింతకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయన మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శివకుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతున్నదని, సీఎం కేసీఆర్ ‘మన ఊరు-మన బడి’ ద్వారా సర్కారు బడుల్లోని సమస్యలు రూపుమాపేందుకు చర్యలు చేపట్టారని తెలిపారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు రూ.3 కోట్ల 97 లక్షలు మంజూరయ్యాయని, పెద్దచింతకుంట పాఠశాలలో పనులు చేపట్టేందుకు రూ.7.28 లక్షలు మంజూరైనట్లు వెల్లడించారు. ఈ నిధులతో పాఠశాలను సుందరీకరించుకోవాలని, కావాల్సిన సౌకర్యాలు కల్పించుకోవాలని సూచించారు.
పేద విద్యార్థులకు ఆంగ్ల విద్యను అందించడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. అలాగే, నర్సాపూర్ నియోజకవర్గానికి 3 వేల డబుల్ బెడ్రూమ్లు మంజూరు కానున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మెదక్ విద్యాధికారి రమేశ్కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 900 ప్రభుత్వ పాఠశాలలకు గానూ 300 పాఠశాలలు ‘మన ఊరు-మన బడి’కి మొదటి విడతగా ఎంపిక చేశామని వెల్లడించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనసూయఅశోక్గౌడ్, మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్, జడ్పీటీసీ బాబ్యానాయక్, వైస్ ఎంపీపీ వెంకట నర్సింగరావు, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, ఆత్మకమిటీ చైర్మన్ శివకుమార్, ఏఎంసీ వైస్ చైర్మన్ హబీబ్ఖాన్, సర్పంచ్ గుండె శివకుమార్, డీఈవో రమేశ్, ఎంఈవో బుచ్చానాయక్, ఎంపీడీవో మార్టిన్ లూథర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణాధ్యక్షుడు భిక్షపతి, పీఆర్డీఈ రాధికాలక్ష్మి, ఏఈ స్వామిదాస్, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు నగేశ్, ఆంజనేయులు, ఉపసర్పంచ్ నాగరాజు, కో-ఆప్షన్ సభ్యుడు లక్ష్మణ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
కౌడిపల్లి మండలంలో..
కౌడిపల్లి మండలంలోని రాయిలాపూర్, కౌడిపల్లి, భుజరంపేట ప్రభుత్వ పాఠశాలల్లోనూ ‘మన ఊరు-మన బడి’ పనులను ఎమ్మెల్యే మదన్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో రాయిలాపూర్ పాఠశాలకు రూ.23 లక్షలు, కౌడిపల్లి పాఠశాలకు రూ.7 లక్షలు, భుజరంపేట పాఠశాల రూ.10.40 లక్షలు మంజూరైనట్లు పంచాయతీరాజ్ డీఈ, ‘మన ఊరు-మన బడి’ మండల ఇన్చార్జి అధికారి జగన్నాథం తెలిపారు. కార్యక్రమాల్లో ఎంపీపీ రాజునాయక్, జడ్పీటీసీ కవిత అమర్సింగ్, ఎంపీడీవో భారతి, తహసీల్దార్ కృష్ణయ్య, మండల విద్యాధికారి బుచ్యానాయక్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు చిలుముల వెంకటేశ్వర్ రెడ్డి, సర్పంచ్లు శేఖులు, వనజాశ్యాంసుందర్, వార్డు సభ్యురాలు స్వప్న, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్లు, నాయకులు రామాగౌడ్, శివాంజనేయులు, యాదాగౌడ్, కిషోర్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫైజాబాద్లో..
చిలిపిచెడ్ మండల పరిధిలోని ఫైజాబాద్ ప్రాథమిక పాఠశాలలో ఎమ్మెల్యే మదన్రెడ్డి ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమంలో భాగంగా పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో మొదటి విడతలో 11 పాఠశాలలు ఎంపిక చేశారని, మరమ్మతులకు రూ.2 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ వినోదదుర్గారెడ్డి, నర్సాపూర్ ఆర్డీవో వెంకట ఉపేందర్రెడ్డి, పంచాయతీరాజ్ డీఈ అమరేశ్వర్, తహసీల్దార్ కమలాద్రి, పీఆర్ ఏఈ మధుబాబు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అశోక్రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ ధర్మారెడ్డి, రైతు బంధు మండలాధ్యక్షుడు రాజిరెడ్డి, స్థానిక సర్పంచ్ మనోహర నర్సింహారెడ్డి, ఎంపీటీసీ మల్లమ్మ సంగాగౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.