శివ్వంపేట/ రామాయంపేట/ హవేళీఘనపూర్/ నిజాంపేట/ చేగుంట/ వెల్దుర్తి, జనవరి 11 : జిల్లావ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం అనేక చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగం గా మండలస్థాయిలో ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమా వేశా లను నిర్వహిస్తున్నారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని విజ య వంతం చేయడానికి స్థానిక ప్రజాప్రతినిధులు పూర్తిగా సహక రించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ చందునాయక్ కోరారు.
18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ చందునాయక్ సూచిం చారు. శివ్వంపేట ప్రజాపరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ హరికృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి జిల్లా వైద్యాధికారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో చందునాయక్ మాట్లాడుతూ.. కంటివెలుగు శిబిరంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా పరీక్షలు చేసి కంటి అద్దాలతోపాటు అవసరమైతే ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామని అన్నారు. కంటి వెలుగు శిబిరాన్ని నిర్వహించే ముందు స్థానిక ప్రజలకు ఆశ వర్కర్లు టోకెన్లు అందజేస్తారని, ఇచ్చిన తేదీ ప్రకారం శిబిరానికి వచ్చి, కంటిపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ముందుగా శివ్వంపేట పీహెచ్సీ సందర్శించి, వైద్యసేవలను పరిశీలించారు. ఎంపీపీ హరికృష్ణ మాట్లాడుతూ..ఈ నెల 18న శివ్వంపేట, కొంతాన్పల్లి గ్రామా ల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. శివ్వంపేట మండలంలో రెండు వైద్యబృందాలు గ్రామాల్లో కంటి పరీక్షలు చేస్తారని, నాలుగైదు రోజులముందే చాటింపు వేయిస్తారని వివరించారు. కంటివెలుగు శిబిరాల వద్ద ప్రజలకు ఇబ్బంది లేకుండా టెంటు, కుర్చీలు, మంచినీటి సదుపాయాలు కల్పించాలని సర్పంచ్లకు సూచిం చారు. సమావేశంలో మండల ప్రత్యే కాధికారి నర్సయ్య, ఎం పీడీవో నవీన్కుమార్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, మం డల వైద్యాధికారి సాయిసౌమ్య, సీనియర్ అసిస్టెంట్ నరేందర్రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు లాయక్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
రామాయంపేట పట్టణంలోనిర్వహించనున్న కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్మన్ జితేందర్గౌడ్, కమిషనర్ యాదగిరి, డి.ధర్మారం పీహెచ్సీ డాక్టర్ హరిప్రియ పేర్కొన్నారు. రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో, వైద్య సిబ్బంది, వార్డు ఇన్చార్జిలు, ఏఎన్ ఎం, ఆశ వర్కర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని పట్టణంలో బూత్ల వారీగా ఏర్పాటు చేస్తామన్నారు. 18 ఏండ్ల నుంచి వృద్ధ్దుల వరకు కంటి పరీక్ష లు చేయించి, ఉచితంగా కంటి అద్దాలు అందజేస్తామని తెలి పారు. సమావేశంలో కౌన్సిలర్లు దేమె యాదగిరి, చిలుక గంగాధర్, గజవాడ నాగరాజు, డి.ధర్మారం పీహెచ్సీ వైద్య సిబ్బంది సత్తమ్మ, మేనేజర్ శ్రీనివాస్, హెల్త్ సూపర్వైజర్ సునంద, వార్డు ఆఫీసర్లు శివరాజు, శ్రీనివాస్, వెంకటస్వామి, కరుణాకర్, ఎల్లయ్య, శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హవేళీఘనపూర్ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ శేరి నారాయణరెడ్డి ఆధ్యక్షతన ‘కంటి వెలుగు’పై ప్రత్యేక సమావే శం నిర్వహించారు. కంటి వెలుగు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందని ఎంపీపీ నారాయణరెడ్డి అన్నారు. ప్రతిఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీరామ్, మండల కోఅప్షన్ సభ్యు డు ఖాలేద్, సర్ధన పీహెచ్సీ డాక్టర్ వినయ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
నిజాంపేట మండలంలోని నందిగామ గ్రామంలో ఈ నెల 18న నిర్వహించనున్న కంటి వెలుగు కార్యక్రమానికి ఏర్పా ట్లు చేస్తున్నారు. సర్పంచ్ ప్రీతి, వార్డు సభ్యులతో కలిసి కంటి వెలుగు శిబిరం నిర్వహించే మహిళా భవనాన్ని పరిశీలించా రు. ఏర్పాట్లను డీ.ధర్మారం పీహెచ్సీ వైద్యురాలు హరిప్రియ, పీహెచ్ఎన్ సత్తమ్మ పరిశీలించారు. గ్రామస్తులకు తగిన వసతులు కల్పించాలని సర్పంచ్కు సూచించారు.కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆరిఫ్ హూస్సేన్ ఉన్నారు.
చేగుంట మండల పరిషత్ కార్యాలయలంలో ఎంపీడీవో ఆనంద్మేరి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా మండల ప్రత్యేక అధికారి జయరాజ్ మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి జూన్ 30 వరకు కంటి వెలుగు కొనసాగుతుందని తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయం తం చేయాలని ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, వైద్య సిబ్బందికి సూచించారు. సమావేశంలో ఎంపీపీ శ్రీనివాస్, వైద్యులు రవికుమార్, అనిల్ పాల్గొన్నారు.
వెల్దుర్తి మండలంలో నిర్వహించనున్న కంటి వెలుగు కా ర్యక్రమ షెడ్యూల్ను వైద్యాధికారులు ప్రకటించారు. వెల్దుర్తి పీహెచ్సీ డాక్టర్లు సౌజన్య, శిరీష, ఎంపీహెచ్వో ప్రదీప్ వివ రాలు వెల్లడించారు. వెల్దుర్తి ఉమ్మడి మండలంలోని 30గ్రామ పంచాయతీలకు రెండు వైద్య బృందాలను ఏర్పాటు చేశామ న్నారు. ఒక్కో బృందంలో డాక్టర్తో సహా 10 మంది సిబ్బంది ఉంటారని, ప్రతిరోజూ150 మందికి కంటి పరీక్షలు నిర్వహి స్తారని తెలిపారు. ఒక్కో గ్రామాన్ని పూర్తి చేసుకుంటూ మరో గ్రామానికి వెళ్తామన్నారు. కంటి వెలుగు శిబిరాలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సహకరించాలని కోరారు.
మనోహరాబాద్, జనవరి 11 : మండలంలో కంటి వెలు గు కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని ఎంపీపీ నవనీతారవి ముదిరాజ్ అన్నారు. మనోహరాబాద్లో సర్పంచ్లు, ఎంపీటీసీలతో కంటి వెలుగుపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 18 నుంచి వంద రోజుల వరకు కంటి వెలుగు కొనసాగుతుందన్నారు. ఆయా గ్రామాల్లో నిర్వహించే కంటి వెలుగు శిబిరాల్లో ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండాలని సూచించారు. సమావేశంలో మండల ప్రత్యేకాధికారి కృష్ణమూర్తి, ఎంపీడీవో యాదగిరిరెడ్డి, వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి, సర్పంచ్లు మల్లేశ్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.