మెదక్ రూరల్, డిసెంబర్ 1: కుటుంబంతోపాటు పని చేసే ప్రదేశం సహా పలు చోట్ల మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురవుతున్న మహిళలు, యువతులు, బాలికలకు మేమున్నామంటూ బాసటగా నిలుస్తున్నాయి ‘సఖీ’కేంద్రాలు. పనిచేసే పలు చోట వేధింపులకు గురై బయటకు చెప్పుకోలేని ఎందరో మహిళలు, యువతులకు మనోధైర్యం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘సఖీ’కేంద్రాలను ఏర్పాటు చేసి చేయూతనిస్తున్నది. దీనిలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెదక్లో సెప్టెంబర్ 2019లో ‘సఖీ’కేంద్రం ఏర్పాటు చేసింది. వ్యక్తిగత సమస్యలతో వచ్చేవారికి న్యాయపరమైన సూచనలు ఇవ్వడంతో పాటు ఎన్నో రకాల సేవలను అందిస్తూ.. జీవితాలకు భరోసానిస్తున్నాయి ‘సఖీ’కేంద్రాలు. న్యాయ, వైద్య, పోలీసు శాఖల సమన్వయంతో ఈ సేవలను ఉచితంగా అందిస్తున్నాయి.
మెదక్ జిల్లా కేంద్రంలో ఇటీవల రూ.73.15 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ‘సఖీ’భవన కేంద్రాన్ని రాష్ట్ర మంత్రులు హరీశ్రావు, సత్యవతి రాథోడ్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డితో కలిసి ప్రారంభించారు.
‘సఖీ’కేంద్రాలకు రాలేని మహిళల కోసం హెల్ప్లైన్ నంబర్ సైతం ఏర్పాటు చేశారు. సమస్యల్లో ఉన్న మహిళలు టోల్ ఫ్రీ నంబర్ 181ను లేదా మెదక్ సఖీ కేంద్రం నంబర్లు 08452-295181, 9346146580, సంప్రదించవచ్చు. ఇది 24గంటలు అందుబాటులో ఉంటుంది. ఏ సమయంలోనైనా బాధితులు ఫోన్ ద్వారా సంప్రదిస్తే.. వారున్న ప్రదేశానికే ఓ వాహనం వస్తుంది. ఈ వాహనంలో ఒక మహిళా కానిస్టేబుల్తో పాటు మానసిక నిపుణులు సైతం ఉంటారు. వీరు బాధితులకు భరోసానిస్తూ ‘సఖీ’కేంద్రానికి తీసుకెళ్తారు.
హింస, వేధింపులు బారిన పడ్డ వారికి నేషనల్ హెల్త్ మిషన్, 108, పోలీసులతో అత్యవసర సేవలు అందించడం, వారిని కాపాడిన తర్వాత ఆశ్రయం కల్పించడం కోసం సమీపంలోని హోమ్లకు తరిలించడం బాధితులకు వైద్య సేవలు అందించేందుకు సమీప దవాఖానలకు పంపించడం వంటి సేవలు ‘సఖీ’కేంద్రం అందిస్తున్నది. వారికి అవసరమయ్యే పరీక్షలను కూడా ఉచితంగా నిర్వహిస్తారు. తాత్కాలింగా మహిళా హోంలలో ఆశ్ర యం కల్పించి, కనీసం ఐదు రోజులకు తక్కువ కాకుండా వసతి కల్పిస్తారు. బాధితులు కోర్టు ప్రొసిడింగ్స్కు హాజరుకాలేని పరిస్థితుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో తమ వాదనలు వినిపించే సౌకర్యాన్ని ‘సఖీ’కేంద్రం కల్పిస్తుంది.
* 2019 సెప్టెంబర్ నుంచి 2023 అక్టోబర్ 17 వరకు 940 కేసులు నమోదు కాగా అందులో 810 కేసులు పరిష్కరించగా, 130 కేసులు పెండింగ్లో ఉన్నాయి.
* 309 అవగాహన సదస్సులు నిర్వహించి 87,669 మందికి ‘సఖీ’సేవల గురించి తెలియజేశారు.
మహిళలు, యువతులు తమకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైన ‘సఖీ’కేంద్రాన్ని ఆశ్రయించవచ్చు. ఇక్కడ సరైన కౌన్సిలింగ్తో పాటు న్యాయపరమైన, పోలీసు సహకారంతో కోర్టు ద్వారా పరిష్కారం పొందే అవకాశాలు ఉన్నాయి. సెంట్రల్ అడ్మిన్తో పాటు సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారు. బాధితులు 181కుగాను 100కి గాను సమాచారం అందిస్తే అవసరమైన సేవలు అందించేందుకు ‘సఖీ’కేంద్రం సమాయత్తం అవుతుంది. అవసరాన్నిబట్టి బాధితులకు వాహనం అందుబాటులో ఉంటుంది.
మహిళా భద్రత కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని అందు లో భాగంగా మహిళలు, యువతులకు అండగా ప్రభు త్వం ‘సఖీ’ కేంద్రాలు ద్వారా సేవలు అందించడం జరుగుతున్నదన్నా రు. ఇటీవల మెదక్ జిల్లా కేంద్రంలో రూ 73.15 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ‘సఖీ’భవన కేంద్రం ప్రారంభించడం జరిగింది. మహిళలకు ఎలాంటి సమస్యలు ఎదురైన తక్షణమే సాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 181కు కాల్ చేయాలి. బాధితులు ఆధైర్యపడకుండా ‘సఖీ’కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి.
బాధిత మహిళలు ఫోన్ ద్వారా సమాచారం అందించిన వెంటనే స్పందిస్తు న్నాం. వారికి తగిన రక్షణ కల్పించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటు న్నాం. సఖీ కేంద్రానికి వచ్చే మహిళలకు అవసరమైన మేరకు కౌన్సిలింగ్ ఇస్తున్నాం. కేంద్రానికి వచ్చే బాధితుల్లో ఎక్కువ మంది కుటుంబ కలహాల సమస్యలతో వస్తున్నారు. విద్యాసంస్థల యజమాన్యాలు, అంగన్వాడీ టీచర్లు, సమైక్య మహళా సభ్యుల సహకారంతో సేవలను మరిం త విస్తృతం చేస్తున్నాం.
వేధింపులకు గురైన బాధిత మహిళలకు అండగా నిలచి వారికి భరోసా కల్పించడానికే సఖీ కేంద్రం పని చేస్తుంది. ఆపదలో ఉన్న మహిళలు, యువతులు నిర్భయంగా టోల్ ఫ్రీ నం బర్181కు కాల్ చేస్తే, వారికి అవసరమైన సేవలు అందిస్తాం. సఖీ సెంటర్లలో సేవలు అం దించేవారు 24 గంటలు అందుబాటులో ఉంటా రు. బాధితుల పక్షాన ఎవరైనా ఫోన్ చేసిన వెంటనే స్పందిస్తాం. సదరు వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతాం.