తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించి విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. వేడుకల ఏర్పాట్లపై హైదరాబాద్ నుంచి సోమవారం కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూన్ 2వ తేదీ నుంచి 22 వరకు దశాబ్ది వేడుకలను పండుగ వాతావరణంలో జరుపుకోవాలని, అందుకోసం పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో సమావేశాలు నిర్వహించి అధికారు లకు దిశానిర్దేశం చేయాలన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధిని శాఖల వారీగా ఫ్లెక్సీలు, కరపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రజా ప్రతి నిధులతో పాటు అన్ని వర్గాల వారు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు.
మెదక్, మే 29 (నమస్తే తెలంగాణ) : జూన్ 2 నుంచి 22 తేదీ వరకు రాష్ట్ర దశాబ్ది వేడుకల్లో మన ప్రగతి చాటేలా విధంగా ఘనంగా నిర్వహించాలని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. రైతు దినోత్సవం, ఊరురా చెరువుల పండుగ నిర్వహణ పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు.
రైతు దినోత్సవం నాడు జిల్లాలో ఉన్న రైతు వేదికలో వేడుకలు జరగాలని, ప్రతి గ్రామం నుంచి రైతులను డప్పులతో ఘనంగా పండుగ వాతావరణంలో రైతు వేదికలకు తీసుకు రావాలని, అకడ ప్రభుత్వం ప్రతి రైతుకు కల్పించిన సౌకర్యాలు, అందించిన సాయంపై తెలియజేయాలని, భోజన ఏర్పాట్లు ఉండాలని అన్నారు. జూన్ 8న ఊరురా చెరువుల పండుగ సందర్భంగా గ్రామాల్లో ఉన్న పెద్ద చెరువు వద్ద బతుకమ్మ, బోనాలతో సాంసృతిక కార్యక్రమాలు, కట్ట మైసమ్మ పూజ, భోజనాలు పకడ్బందీగా చేయాలని తెలిపారు. రైతు దినోత్సవం, ఊరురా చెరువుల పండుగ నిర్వహణకు జిల్లాలో అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకోవాలని, క్షేత్ర స్థాయిలో ప్రతి అంశాన్ని పర్యవేక్షించాలని, ఎకడా ఎలాంటి పొరపాట్లు కావద్దని సీఎస్ సూచించారు.
విద్యుత్ రంగంలో గత పరిస్థితి, నేడు సాధించిన ప్రగతి తెలియజేస్తూ నాడు- నేడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, పోలీస్ ఆధ్వర్యంలో సురక్షా దివస్, తెలంగాణ రన్ నిర్వహించాలని అన్నారు. పారిశ్రామిక వాడాలో ప్రగతిపై సమావేశాలు ఏర్పాటు చేయాలని, సాగునీటి రంగంలో సాధించిన విజయాలు తెలియజేయాలన్నారు. జూన్ 9న సంక్షేమ సంబురాలు సందర్భంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రెండో విడత గొర్రెల పంపిణీ, అవకాశం ఉన్న చోట ఇంటి పట్టాల పంపిణీ, బీసీ కులవృత్తుల ఆర్థిక సాయం ప్రారంభించాలన్నారు.
ప్రత్యేక రాష్ట్రంలో పరిపాలన సౌల భ్యం కోసం ఏర్పాటు చేసిన నూతన జిల్లాలు, మండలాలు, గ్రామాల వివరాలు తెలియజేయాలని, మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో సాధించిన ప్రగతి, కొత్త దవాఖానల ఏర్పాటు, అందిస్తున్న అదనపు సేవలను వివరించాలని, ఈ సందర్భంగా కేసీఆర్ న్యుట్రిషన్ కిట్ ప్రారంభించాలన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి సాధించిన విజయాలు ఘనంగా చాటాలని పారిశుధ్య కార్మికులను సన్మానించాలని, సఫాయి అన్న-సలాం అన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అన్నారు. మిషన్ భగీరథ కింద ఇంటింటికీ తాగునీటి సరఫరా, గిరిజనోత్సవం, పెరిగిన పచ్చదనం, విద్యాశాఖలో సాధించిన ప్రగ తి పకాగా తెలియజేయాలని, ఆధ్యాత్మిక రంగంలో సాధించిన ప్రగతి, అమరుల సంసరణ కార్యక్రమాలు పకడ్బందీగా జరగాలని సూచించారు.
పకడ్బందీగా నిర్వహిస్తాం.. : కలెక్టర్ రాజర్షి షా
21 రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించుటకు కార్యాచరణ రూపొందించుకొని, అధికారులకు దిశా నిర్దేశం చేశామని కలెక్టర్ రాజార్షి షా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడారు. దశాబ్ది ఉత్సవాలు పకడ్బందీగా నిర్వహించుటకు అధికారులతో పలు దఫాలు సమావేశాలు ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేశామన్నారు. ఆదివారం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి సమక్షంలో కార్యాచరణ ఆమోదించుకొని గ్రామ, నియోజక వర్గ, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయు కార్యక్రమాలపై ఒక అవగాహన వచ్చి సిబ్బందికి విధులు కేటాయిస్తూ ఆర్డర్స్ కూడా ఇస్తున్నామన్నారు. నియోజక వర్గ స్థాయిలో శాసనసభ్యుల ఆధ్వర్యంలో సమావేశాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ప్రధానంగా క్లస్టర్ పరిధిలో, గ్రామాల్లో చేపట్టే పెద్ద కార్యక్రమాలైన రైతు దినోత్సవం, ఊరూరా చెరువుల పండుగ ఘనంగా నిర్వహించుటకు అధికారులను సమాయత్తం చేశామన్నారు. నోడల్ అధికారులు తమ శాఖ ఇచ్చే ఆదేశాలతో పాటు కార్యక్రమ షెడ్యూల్ ప్రకారం 2014కు పూర్వం ఇప్పటి వరకు సాధించిన ప్రగతిపై నియోజక వర్గం, గ్రామ, మండలాల వారీగా నాడు-నేడు పరిస్థితులపై అద్దంపట్టే విధంగా రూపొందించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు. ఆయా రోజుల్లో శాఖా కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు కరపత్రాలు పంపిణీ చేస్తారని, లబ్ధిదారుల విజయగాథలు, అభిప్రాయాలను నలుగురికి తెలిపేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నామన్నారు. చకటి ఫ్లవర్ డెకరేషన్తో పాటు మూడు రోజుల పాటు విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నామన్నారు.
జిల్లాలోని కొన్ని ప్రధాన కార్యాలయాలతో పాటు ఏడుపాయల, ఖిల్లా, చర్చి ప్రదేశాలను 21 రోజుల పాటు విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో, జిల్లా ప్రవేశం, ముగింపు ప్రాంతాల్లో, జంక్షన్లలో ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. కార్యక్రమాల నిర్వహణపై డాక్యుమెంటేషన్తో పాటు వీడియో చిత్రీకరణ చేయనున్నామని సీఎస్కు వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రమేశ్, ప్రతిమాసింగ్, డీఎస్పీ సైదులు, జిల్లా అధికారులు యేసయ్య, చందు నాయక్, సాయిబాబా, ఆశా కుమారి, విజయశేఖర్ రెడ్డి, జయరాజ్, బ్రహ్మజీ, రవి ప్రసాద్, విజయలక్ష్మి, రజిని, ఖాసీం, రాధాకిషన్, రాజిరెడ్డి, జెంలా నాయక్, సత్యనారాయణ రెడ్డి, ఇందిరా, కరుణ, కమలాకర్, సాయి రామ్ తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డిలో..
సంగారెడ్డి కలెక్టరేట్, మే 29 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను పండగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుంచి 22 వరకు రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు నిర్ణయించిందని స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు దశాబ్ది వేడుకల్లో పాల్గొనేలా చూడలాన్నారు.
కమిటీలను ఏర్పాటు చేశాం..
కలెక్టర్ డాక్టర్ శరత్ మాట్లాడుతూ జిల్లాలో దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆయా కమిటీలను జిల్లా అధికారులతో ఏర్పాటు చేశామని సీఎస్కు వివరించారు. దశాబ్దిఉత్సవాలకు సంబంధించి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. జిల్లాలో అన్ని రైతు వేదికల్లో రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. హరితోత్సవంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా విరివిగా మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రజా ప్రతినిధుల సహకారంతో దశాబ్దిఉత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ వీడియోకాన్ఫరెన్స్లో జిల్లా నుంచి ఎస్పీ రమణ కుమార్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్వో నగేశ్, ఆయా శాఖల జిల్లా ఆధికారులు పాల్గొన్నారు.
పండుగలా జరుపుకొందాం
నర్సాపూర్, మే 29 : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పండుగలా జరుపుకొందామని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. సోమవారం నర్సాపూర్ పట్టణ శివారులో బీవీఆర్ కళాశాల అడిటోరియంలో ఉత్సవాల నిర్వాహణపై నియోజకవర్గ స్థాయి ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్రెడ్డి, రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ దేవేందర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ గడిచిన తొమ్మిదేండ్లలో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎట్లుండే.. ఇప్పుడెట్లుంది.. అనే విషయంపై బేరీజు వేసుకోవాలని తెలిపారు. ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 2 నుంచి జూన్ 22 తేదీ వరకు వివిధ అంశాలపై ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ఉత్సవాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించి విజయవంతం చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మన్సూర్, ఆత్మకమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, జిల్లా అధికారులు, వివిధ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.