గద్వాల అర్బన్, జనవరి 3 : తాగడానికి నీళ్లు ఇవ్వండి మహాప్రభో.. అంటూ జిల్లా కేంద్రానికి చెందిన 7వ వార్డు ప్రజలు బుధవారం మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సం దర్భంగా ప్రజలు మాట్లాడుతూ ఇంకా వేసవి కాలం రాలేదు అప్పుడే నీళ్ల కోసం ఇబ్బంది పెడతారా అని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ సర్కారు మిషన్ భగీరథ ద్వారా ట్యాంకులు నిర్మించి, ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి శాశ్వతంగా నీరు అందించేందుకు కృషి చేశారని గుర్తు చేశారు.
ఈ ప్రభుత్వం వచ్చిన నెల రోజులకే మిషన్ భగీరథ పైపు లింక్ను బంద్ చేశారు. దాదాపు పది రోజులుగా నీటిని విడుదల చేయడం లేదని ఆరోపించారు. అధికారులు స్పందించి తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ దౌలన్న, కాలనీవాసులు మధు, సుదర్శన్ గౌడ్, సాయిబాబా, అంజి తదితరులు ఉన్నారు.