చేగుంట, నవంబర్ 25 : పేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి తనయుడు కొత్త పృథ్వీరెడ్డిఅన్నారు. చేగుంట మండలపరిధిలోని వడియారం,చిన్నశివునూర్,పెద్ద శివునూర్, పోతన్శెట్టిపల్లి, నడిమితాండ, చెట్లతిమ్మాయిపల్లి, పోతాన్పల్లి, కసాన్పల్లి,చందాయిపేట్,మక్కరాజిపేట్తో పాటు పలు గ్రామాల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లోని మహిళలు బతుకమ్మలు, బోనాలు, మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేద బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. గతంలో రైతులకు ఎరువులు, విత్తనాలు,కరెంటు ఇవ్వని ప్రభుత్వాలతో ప్రజలు అనేక గోస పడి ఇబ్బందులు పడ్డారన్నారు.
తెలంగాణ రాక ముందు వ్యవసాయాన్ని ఏ ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ రైతుబంధు ఇచ్చి రైతులకు మేలు చేశారని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదంటి ఆడ బిడ్డలకు మేలు చేశారని అన్నారు. రైతు భీమాతో రైతు కుటుంబానికి ప్రభుత్వం పెద్దదిక్కుగా నిలిచిందన్నారు. ఝూట మటాలతో గెలిచిన ఎమ్మెల్యే రఘునందన్రావు నియోజక వర్గంలో పైసా పనిచేయలేదని,కాంగ్రెస్ గెలిస్తే రైతులకు మూడుగంటల కరంటు ఇస్తాదట.. ఈ కార్యక్రమంలో చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు రంగయ్యగారి రాజిరెడ్డి, వెంకట నర్సింహారెడ్డి, సుభాశ్రెడ్డి, రజనక్ ప్రవీణ్ కుమార్,నాయిని రాజ్గోపాల్, సర్పంచ్ల వడ్డెపల్లి తిరుమల నర్సింహులు, కొటారి అశోక్, ముదాం రుక్మిణిబాయి శ్రీనివాస్, స్వాతి శ్రీనివాస్, దానం నెల్లూర్,మోహన్రాథోడ్, కారింగుల సంతోషసిద్దిరెడ్డి, బుడ్డ స్వర్ణలతాభాగ్యరాజ్, కుమ్మరి శ్రీనివాస్,ఎంపీటీసీలు బక్కి లక్ష్మీ, మెతు కు శ్రీనివాస్, హోళియనాయక్, బండి కవిత విశ్వేశ్వర్, వంటరి కొండల్రెడ్డి, నారాయణరెడ్డి, పట్నం తానీషా, సంతోష్కుమార్తో పాటు వివిధ గ్రామాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
చేగుంట, నవంబర్ 25 :దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థ్ధి కొత్త ప్రభాకర్రెడ్డి గెలుపునకు మండల కేంద్రమైన చేగుంటతో పాటు పలు గ్రామాల్లో శనివారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మండల పరిధిలోని కర్నాల్పల్లి, రాంపూర్తో పాటు మండల కేంద్రమైన నార్సింగిలోజడ్పీటీసీ బాణపురం కృష్ణారెడ్డి,ఎంపీటీసీ ఆకుల సుజాతా మల్లేశంగౌడ్ ప్రచారం చేశారు.
చేగుంట, నవంబర్25 : అభివృద్ధి చేసే బీఆర్ఎస్కి తాను అండగా ఉంటానని, బీఆర్ఎస్ పార్టీలో పలువురు స్వచ్ఛందంగా చేరుతున్నారు. చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు రెడ్డిపల్లి సొసైటీ చైర్మన్ మ్యాకల పరమేశ్ ఆధ్వర్యంలో శనివారం దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డికి సమక్షంలో దుబ్బాకలోని క్యాంప్ కార్యాలయంలో చేరారు. పులిమామిడి గ్రామానికి చెందిన పలువురు యువకులు రమేశ్, మాజీ సర్పంచ్ నాయిని రాజ్గోపాల్ ఆధ్వర్యంలోకొత్త ప్రభాకర్రెడ్డి తనయుడి పృథ్వీకృష్ణరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.