మెదక్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి ఘన విజయం సాధించారు. మెదక్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఓటమి పాలయ్యారు. ఆదివారం హవేళీఘనపూర్లోని వైపీఆర్ కళాశాలలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ను లెక్కించారు. అనంతరం ఈవీఎంలను లెక్కించారు. ఉదయం 9 గంటల తర్వాత తొలి రౌండ్ ఫలితాలు ప్రకటించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు చివరి ఫలితాలను ప్రకటించారు. ఈ ఉత్కంఠ పోరులో నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డిపై 8875 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ 10157 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
మెదక్ నియోజకవర్గ అసెంబీ ్లఎన్నికల పోలింగ్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరోహోరీ పోరు సాగింది. ఆదివారం ఉదయం 8 గంటలకు్రప్రారంభమైన ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి ఆరు రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్కు అధిక్యం రాగా, ఏడో రౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డికి 370 ఓట్లతో లీడ్లో ఉంది. ఆ తర్వాత 14వ రౌండ్ వరకు కాంగ్రెస్ అధిక్యంలో ఉంది. 16, 17వ రౌండ్లో బీఆర్ఎస్కు 1988 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్కు 18, 19, 20 రౌండ్లలో అధిక్యం రావడంతో 10,157 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మెదక్ నియోజకవర్గంలో మొత్తం 18,86,946 ఓట్లు పోలయ్యాయి. ఇందులో బీఆర్ఎస్కు 76,969 ఓట్లు రాగా, కాంగ్రెస్కు 87,126 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 13,657 ఓట్లు రాగా, బీఎస్పీకి 1112 ఓట్లు వచ్చాయి. నోటాకు 1860 ఓట్లు పోలు కాగా, 83 ఓట్లు చెల్లనివి. పోస్టల్ బ్యాలెట్లో బీఆర్ఎస్కు 334 ఓట్లు రాగా, కాంగ్రెస్కు 1253 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 305 ఓట్లు పోలయ్యాయి.
నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఆసరా పింఛన్లు, దళితబంధు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర పథకాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసింది. వీటన్నింటిపై ప్రజలకు అవగాహన కల్పించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డిపైన 8875 ఓట్ల మెజార్టీతో సునీతాలక్ష్మారెడ్డి గెలుపొందారు. మొదటి రౌండ్లో బీఆర్ఎస్కు 677 ఓట్లు రాగా, 5వ రౌండ్లో 177 ఓట్లు, 6వ రౌండ్లో 22 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత కాంగ్రెస్ అధిక్యంలో ఉంది. బీఆర్ఎస్కు 9వ రౌండ్లో 453 ఓట్లు, 10వ రౌండ్లో 374 ఓట్లు, 11వ రౌండ్లో 588 ఓట్లు, 12వ రౌండ్లో 217ఓట్లు, 13వ రౌండ్లో 156 ఓట్లు, 14వ రౌండ్లో 3 ఓట్లు, 15వ రౌండ్లో 537 ఓట్లు, 16వ రౌండ్లో 1362 ఓట్లు, 17వ రౌండ్లో 1383 ఓట్లు, 18వ రౌండ్లో 1172 ఓట్లు వచ్చాయి. 20వ రౌండ్లో 1876 ఓట్లు, 21వ రౌండ్లో 2049 ఓట్లు, 22వ రౌండ్లో 1081 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 8875 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి విజయం సాధించారు.