చేగుంట, మార్చి 12: ఆర్థిక ఇబ్బందులతో ఓ మహిళా కూలీ ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన మెదక్ జిల్లా నార్సింగి మండలం బీంరావ్పల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. నార్సింగి పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బీంరావ్పల్లి గ్రామానికి చెందిన ఇప్పంకింది కలమ్మ(40), భర్త రాములు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కొద్దిపాటి భూమి ఉండగా బోరు నుంచి నీళ్లు రాకపోవడంతో వేసిన పంట ఎండిపోయింది. అప్పటినుంచి కూలి పనులకు వెళ్తున్నారు. చిట్టి డబ్బులు కట్టే విషయమై రాత్రి మాట్లాడుకున్నారు. రోజులాగే తిని పడుకున్నారు. ఉదయం లేచి చూసే సరికి తన భార్య ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నదని రాములు తెలిపాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతురాలి భర్త రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చేగుంట, మార్చి 12: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం కిష్టాపూర్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకున్న ది. బాధత కుటుంబ సభ్యులు, చేగుంట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కిష్టాపూర్కు చెందిన కుర్మ స్వామి(30) తనకున్న భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వ్యవసాయానికి చేసిన అప్పులు, కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో మనస్తాపానికి గురై తన పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య మౌనిక ఫిర్యాదు మేరకు చేగుంట పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించా రు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాల్రాజు తెలిపారు.