మెదక్ జిల్లా న్యూస్ నెట్వర్క్, ఫిబ్రవరి 28 : జాతీయ విజ్ఞానశాస్త్ర (సైన్స్ డే) దినోత్సవాన్ని మంగళవా రం జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సైన్స్ ఉపాధ్యాయులను సన్మానించారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థులు నిర్వహించిన సైన్స్ ప్రదర్శనలు అబ్బురపరిచాయి.
మెదక్ రూరల్: రాజ్పల్లి జడ్పీహెచ్ఎస్లో ఎగ్జిబిట్స్ను పరిశీలిస్తున్న డీఈవో రాధాకిషన్
హవేళీఘనపూర్ మండలంలోని కూచన్పల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శనలను జిల్లా విద్యాధికారి రాధాకిషన్ పరిశీలించి, అభినందించారు. విద్యార్థులు తమ నైపుణ్యంతో తయారు చేసిన ప్రదర్శనలను పరిశీలించి, వివ రాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఈవో రాధాకిషన్ మాట్లాడుతూ.. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకొని పరిశోధనలు చేయాలని సూచించారు. దేశాభివృద్ధి సాంకేతిత వినియోగంతోపాటు నూతన ఆవిష్కర ణపై అధారపడి ఉంటుందన్నారు. ఎక్కడ ఆవిష్కరణలు చేస్తా రో అక్కడ అభివృద్ధి వేగంగా జరుగుతందన్నారు, విద్యార్థులు శాస్త్రీయ ఆలోచనలతో పరిశోధనలపై వైపు అడుగులు వేయా లని సూచించారు.
టేక్మాల్లో విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలను పరిశీలిస్తున్న సర్చంచ్ నాయికోటి సుప్రజాభాస్కర్
రేగోడ్లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులతో కరచాలనం చేస్తున్న అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్