రాష్ట్రంలో సుస్థిరమైన పాలన అందించిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంగళవారం సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్తో కలిసి ఆయన స్థలాలను పరిశీలించారు. అనంతరం బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీశ్రావు మాట్లాడారు. ఈనెల 15వ తేదీన లక్ష మందితో హుస్నాబాద్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల శంఖారాన్ని పూరించనున్నారని తెలిపారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కూడా హుస్నాబాద్ నుంచే ప్రారంభించి విజయం సాధించారని గుర్తుచేశారు.
కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య కుమ్ములాటలే బీఆర్ఎస్ పార్టీ విజయానికి సంకేతమన్నారు. ప్రతిపక్షనాయకులు మాయ మాటలు చెప్పడం తప్ప చేసేది ఏమీలేదని విమర్శించారు.ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని, దేశమే తెలంగాణ వైపు చూసే పరిస్థితి వచ్చిందన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డులకెక్కేలా చేయాలని పిలుపునిచ్చారు.
– హుస్నాబాద్, అక్టోబర్ 10
హుస్నాబాద్, అక్టోబర్ 10 : సీఎం కేసీఆర్కు హుస్నాబాద్ లక్ష్మి నియోజకవర్గంగా మారిందని, అందుకే ఈసారి కూడా ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు వస్తున్నారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కూడా ఇక్కడి నుంచే ప్రారంభించి ఆయా ఎన్నికల్లో విజయం సాధించారని గుర్తుచేశారు. ఈసారి కూడా ఈ ప్రాంత ప్రజలపై ఎంతో నమ్మకంతో ఈ నెల 15న లక్ష మందితో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారని, ఇందుకు ప్రజలందరూ పెద్ద సంఖ్యలో హాజరై సీఎం కేసీఆర్ను మరోసారి హ్యాట్రిక్ సీఎంగా రికార్డులకు కెక్కేలా చేయాలని పిలుపునిచ్చారు.
మంగళవారం హుస్నాబాద్లో సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్తో కలిసి స్థలాలను పరిశీలించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరు అవునన్నా కాదన్నా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఎండ్రికాయలాంటి కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య కుమ్ములాటలే బీఆర్ఎస్ విజ యానికి సంకేతమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఎక్కువ.. గల్లీలో తక్కువ..వయా బెంగళూరు… అనే చందంగా మారిందని, కనీసం టికెట్లు కూడా ఇచ్చుకోలేని దయనీయ పరిస్థితి ఆ పార్టీ ఉందని విమర్శించారు.
మాటలు, మూటలు, ముఠాలతో వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాయ మాటలు చెప్పడం, మూటలు సంపాదించడం, ముఠాలను పెట్టడం, మతకలహాలు సృష్టించడం చేస్తారు తప్ప అభివృద్ధి చేయలేరన్నారు. రాష్ట్రంలో సుస్థిరమైన పాలన అందించిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. తొమ్మిదిన్నరేండ్లలో సీఎం కేసీఆర్ పాలనలో కరువు లేదు.. ఖర్చు లేదన్నారు. హుస్నాబాద్ లాంటి కల్లోల ప్రాంతాలను కూడా సుభిక్షం చేసిన ఘనత సీఎం కేసీ ఆర్దేనన్నారు. హుస్నాబాద్కు కాళేశ్వరం, దేవాదుల నీళ్లు వస్తున్నాయని, త్వరలోనే 8టీఎంసీల గౌరవెల్లి నీళ్లు వస్తాయన్నారు.
గౌరవెల్లిని అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ వాళ్లు పోటీపడటం సిగ్గుచేటన్నారు. నీళొస్తే ప్రజలు సంబురపడుతుంటే.. ప్రతిపక్ష పార్టీల వాళ్లుకన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గౌరవెల్లి హుస్నాబాద్ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ ఇచ్చిన గొప్ప వరమన్నారు. కేసీఆర్ అంటే ప్రజలకు గొప్ప నమ్మకమని, ఈ నెల 15న ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయ్యే మ్యానిఫెస్టో హుస్నాబాద్లోనే సీఎంకేసీఆర్ స్వయంగా ప్రకటించనున్నారని తెలిపారు. 2009లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదన్నారు. పగటిపూట ఉచిత కరెంటు ఇస్తామని కరెంటే లేకుంట చేసిండ్రని, ఆరు కిలోల బియ్యం ఇవ్వలేదని, తండాలను గ్రామపంచాయతీలుగా చేయలేదన్నారు.
2004లో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించడంతో వందలాది మంది ఆత్మబలిదానాలకు కారణమై, ఉద్యమాన్ని అంతం చేసి పొత్తుపెట్టుకున్న పార్టీని పొట్టన పెట్టుకునే కుట్రలు చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎరువుల కోసం చెప్పుడు క్యూలైన్లలో పెట్టడం, కరెంటు కోసం సబ్స్టేషన్ల వద్ద ధర్నాలు, నీళ్ల కోసం బిందెలతో నిరసనలు, రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకపోవడం, ప్రాజెక్టుల ఊసెత్తకుండా రైతులను ఇబ్బందులను గురిచేయడం తప్ప అభివృద్ధి అనేది లేదని ఆరోపించారు. దమ్ము, ధైర్యమున్న సీఎం కాబట్టే 24గంటల కరెంటు ఇచ్చారని, ఎరువులుగానీ, సంక్షేమ పథకాలను గానీ, పంటల కొనుగోళ్లు గానీ నిరాటంకంగా కొనసాగించారన్నారు.
కేవలం హుస్నాబాద్ నియోజకవర్గంలోని గిరిజనతండాల రోడ్లకే రూ.51కోట్ల నిధులు మంజూరు అయ్యాయన్నారు. పీఆర్ నుంచి మరో రూ.24 కోట్లు వచ్చాయని తెలిపారు. దేశమే తెలంగాణ వైపు చూసే పరిస్థితి ఉందన్నారు. సంక్షేమ పథకాలన్నీ దేశవ్యాప్తంగా అమలవుతున్నాయని చెప్పారు. ఒకప్పుడు తిండి గింజలకు తిప్పల పడ్డ తెలంగాణ ఇప్పుడు దక్షిణా భారతదేశ బాంఢాగారంగా మారిందని, ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నంబర్వన్గా నిలిచిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్కో మెట్టుతో అభివృద్ధిలో పైకిపోతున్న తెలంగాణను కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పెడితే పెద్దపాము మింగినట్లు ఒకేసారి కిందపడిపోయి తెలంగాణ ఆగమయ్యే ప్రమాదం ఉందన్నారు.
అభివృద్ధి కొనసాగాలంటే మూడోసారి మళ్లీ సీఎంగా కేసీఆర్ కావాలన్నారు. కావున ప్రజలను కార్యకర్తలు చైతన్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్కుమార్, కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, సిద్దిపేట జడ్పీ వైస్చైర్మన్ రాజిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్చైర్పర్సన్ అయిలేని అనితారెడ్డి, ఎంపీపీలు లకావత్ మానస, మాలోతు లక్ష్మీ, కొత్త వినీత, అనిత, స్వప్న, ప్రభాకర్రెడ్డి, జడ్పీటీసీలు భూక్యా మంగ, గీకురు రవీందర్, వంగ రవీందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎడబోయిన రజనీ తిరుపతిరెడ్డి, ఎన్ఎల్సీఎఫ్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, నాయకులు దేవేందర్రావు, వంగ వెంకట్రామ్రెడ్డి, ఎండీ అన్వర్, చిట్టి గోపాల్రెడ్డి, కాసర్ల అశోక్బాబు, బీలూనాయక్, ఆకుల వెంకట్, తిరుపతిరెడ్డి, పరశురామ్, క్రాంతిరెడ్డి, సాంబరాజు, మామిడి అంజయ్య, ఆవుల మహేందర్, బండి పుష్ప, చిరంజీవి, రమేశ్నాయక్, వికాస్యాదవ్, మున్సిపల్ కౌన్సిలర్లు, ఏడు మండలాల సర్పంచ్, ఎంపీటీసీలు, బీఆర్ఎస్పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడదాం ..
హుస్నాబాద్ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్కు ఎనలేని నమ్మకం ఉన్నదని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై ఉన్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ఇక్కడి ప్రజల ఆశీర్వాదం గొప్పదని భావించిన కేసీఆర్ మూడోసారి కూడా ఇక్కడే ఆశీర్వాద సభ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
లక్ష మందితో హుస్నాబాద్లో సభను నిర్వహించి సీఎం కేసీఆర్కు ప్రజల ఆశీర్వాదం అందేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు కృషి, ఎమ్మెల్యే సతీశ్కుమార్ పట్టుదలతో హుస్నాబాద్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించిందని, మరింత అభివృద్ధి జరగాలంటే అక్కడి సీఎం కేసీఆర్, మంత్రిగా హరీశ్రావు, ఎమ్మెల్యేగా సతీశ్కుమార్ ఉంటేనే సాధ్యమవుతుందన్నారు. ప్రజా ఆశీర్వాద సభను అనుకున్నదానికంటే ఎక్కువ జయప్రదం చేసి సీఎం కేసీఆర్కు ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని, ఇందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.
-బోయినపల్లి వినోద్కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
సమన్వయంతో ఉండి ఆశీర్వాద సభను జయప్రదం చేద్దాం..
ప్రతి మండల, గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు సమన్వయం తో ఉండి మూడోసారి సీఎం కేసీఆర్ హాజరవుతున్న ప్రజా ఆశీర్వాద సభను జయప్రదం చేద్దామని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ పిలుపునిచ్చారు. 15న సాయంత్రం 4 గంటలకు సభకు సీఎం కేసీఆర్ హాజరవుతారని, అంతకు ముందే జన సమీకరణ చేయడం ద్వారా సభాస్థలానికి ప్రజలు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని కార్యకర్తలకు సూచించారు. మనపై నమ్మకంతో సీఎం కేసీఆర్ మూడోసారి కూడా ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తుండటం మనకెంతో గర్వకారణమన్నారు.
సీఎం కేసీఆర్ హ్యా ట్రిక్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, ఇందుకు హుస్నాబాద్ ప్రజల ఆశీర్వాదబలమే తోడవుతుందనే ధీమా వ్యక్తం చేశారు. సభా నిర్వహణకు సమయం తక్కువగా ఉన్నందున ఆ యా గ్రామ, మండలాల నాయకులు ఏర్పాట్లను సమీక్షించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో వివక్షకు గురైన హుస్నాబాద్ ప్రాంతాన్ని తొమ్మిదిన్నరేండ్లలో అభివృద్ధి చెందిన ప్రాంతంగా రూపుదిద్దిన సీఎం కేసీఆర్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ఆయన ప్రజలను కోరారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే నియోజకవర్గంలో అభివృద్ధి నిరాటంకంగా కొనసాగుతుందని, లేకుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారుతుందనేది ప్రజలు గుర్తించారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హ్యట్రిక్ విజయం సాధించడం తథ్యమన్నారు.
-వొడితెల సతీశ్కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే