మెదక్, మే 17 (నమస్తే తెలంగాణ): వానకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికార యంత్రాంగం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. మల్టీపర్పస్ వరర్స్ నుంచి వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఇండ్లు, పరిసరాలతో పాటు మొత్తం గ్రామంలో నీళ్లు నిల్వకుండా చేసేందుకు కృషి చేస్తున్నారు. దోమల నివారణకు ఆయిల్ బాల్స్, గంబూషియా చేపలు వేయడం, తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయడం లాంటి కార్యక్రమాలు ముమ్మరంగా చేపడుతున్నారు.
ఏడు రోజులు కొనసాగనున్న డ్రైవ్
ప్రత్యేక డ్రైవ్ ఈ నెల 17 నుంచి 23వ తేదీ వరకు ఏడు రోజుల పాటు కొనసాగనున్నది. మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం జిల్లాలోని పంచాయతీలకు ప్రతి నెలా రూ.6.75 కోట్లు కేటాయిస్తున్నది. దీంతో పల్లెలన్నీ బాగుపడుతున్నాయి. దాదాపు అన్ని గ్రామాల్లో 90 శాతం సీసీ రోడ్లు, మురుగు కాల్వలు నిర్మించారు. పాత ఇళ్లను తొలిగించడంతో పాటు పారిశుధ్య పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులుగా పంచాయతీ సెక్రటరీ మొదలు అన్ని శాఖల అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ అంటువ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు.
ఉదయం 6 గంటలకే పనులు ప్రారంభం
ప్రతి ఉదయం 6 గంటలకే పారిశుధ్య పనులు ప్రారంభిస్తున్నారు. ఎకడ నీటి నిల్వలు ఉన్నా మట్టితో పూడ్చడం, డ్రైనేజీలు క్లీన్ చేయడం, డిసిల్టింగ్, రోడ్లు, వీధులు ఊడ్చడం, ఇనిస్టిట్యూషన్లు క్లీన్ చేయడం, వాటర్ ట్యాంకులు శుభ్రపరుచడం, వీధులు, మురుగు కాల్వల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం లాంటి పనులు చేపడుతున్నారు. దోమల నివారణకు ఫాగింగ్, స్ప్రెయింగ్తో పాటు నీటి గుంటల్లో ఆయిల్ బాల్స్, గంబూషియా చేపలు వేయడం చేస్తున్నారు. డెంగీని అరికట్టేందుకు ఖాళీ డబ్బాలు, టైర్లు తొలిగిస్తున్నారు.
1643 మంది పారిశుధ్య కార్మికులు
ఏటా రాష్ట్ర ప్రభుత్వం వానకాలానికి ముందు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నది. జిల్లాలోని అన్ని పంచాయతీల్లో కలిపి 1643 మంది పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు. రోజూ పంచాయతీ కార్యదర్శులు పారిశుధ్య కార్మికులతో రహదారులు, మురుగు కాల్వలు, సీసీ రోడ్లను శుభ్రం చేయిస్తున్నారు. పిచ్చిమొక్కలు తొలిగించడం, రోడ్లపై గుంతలు పూడ్చడం, మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు.
పారిశుధ్య సిబ్బందికి సహకరించాలి
పల్లెల్లో పారిశుధ్య ప్రత్యేక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇం డ్లు, పరిసర ప్రాంతాలు పరిశుభ్రం గా ఉంచేలా పారిశుధ్య సిబ్బందికి సహకరించాలి. ఎకడ గుంతలు ఉన్నా, నీళ్లు నిలిచినా సమాచారం ఇస్తే పరిషరిస్తాం. వానకాలం నేపథ్యంలో గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా దోమలు, బ్యాక్టీరియా, క్రిమి కీటకాల నిర్మూలనకు ఈ నెల 17 నుంచి 23 వరకు ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతాయి. ఉదయం 6 గంటలకే పారిశుధ్య వారోత్సవాలు ప్రారంభమవుతున్నాయి.
– సాయిబాబా, డీపీవో, మెదక్