గజ్వేల్, ఏప్రిల్ 12: ‘నమస్తే తెలంగాణ’లో ఈనెల 10న ప్రచురితమైన ‘కొనుగోళ్లేవి’ కథనానికి స్పందించిన అధికారులు సిద్దిపేట జిల్లాలో పొద్దుతిరుగుడు కొనుగోళ్లను ప్రారంభించారు. పది రోజులుగా మార్కెట్లో రైతులు తీసుకొచ్చిన పొద్దుతిరుగుడు కొనుగోళ్లు నిలిచిపోవడంతో అధికారులు గోనె సంచులు తెప్పించి… కాంటాలు వేస్తున్నారు. గజ్వేల్ మార్కెట్లో శుక్రవారం కొనుగోళ్లను పీఏసీఎస్ ఆధ్వర్యంలో అధికారులు ప్రారంభించారు. దీంతో ‘నమస్తే తెలంగాణ’కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.