గజ్వేల్, డిసెంబర్ 3 : అమరుల ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ తెలంగాణను తీర్చిదిద్దుతున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. శనివారం గజ్వేల్ సమీకృత మార్కెట్లో ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్సీ మాట్లాడుతూ శ్రీకాంతాచారి ఆత్మబలిదానం నాడు తెలంగాణ ప్రజలనే కాకుండా యావత్ దేశాన్ని కుదిపేసిందన్నారు. తెలంగాణ కాంక్ష తీవ్రతను ప్రపంచానికి తెలియజేసిందన్నారు. అన్నిరంగాల్లో ఇప్పుడు తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మల్లేశం, ఆత్మకమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, హజ్ కమిటీ సభ్యు లు జాఫర్ఖాన్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయొద్దీన్, మార్కెట్ కార్యదర్శి జాన్వెస్లీ, మండల అధ్యక్షుడు బెండ మధు, పట్టణాధ్యక్షుడు నవాజ్మీరా, మండల ప్రధాన కార్యదర్శి రమేశ్గౌడ్, ఏఎంసీ డైరెక్టర్లు మతిన్, రూబెన్, నాయకులు బీమప్ప, ఉమర్, శివకుమార్, కొమురయ్య, నరసింహ, సాయిరెడ్డి, సంపత్, హన్మంతరెడ్డి, వెంకట్, వినయ్రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ సాధన కోసం శ్రీకాంతాచారి చేసిన ప్రాణత్యాగం వృథాకాలేదని దళిత సంఘాల జేఏసీ చైర్మన్ బత్తుల చంద్రమౌళి అన్నారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రమౌళి మాట్లాడుతూ సీమాంధ్ర పాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంత్చారిని సమాజం ఎన్నటికీ మరిచిపోదన్నారు. అన్నివర్గాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు సత్యనారాయణ, మల్లేశం, రాజేశం, స్వరూప, దళిత సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి 13వ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సామాజిక కార్యకర్త పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు సుభాశ్, బాలయ్య పాల్గొన్నారు.
అక్బర్పేట-భూంపల్లి మం డల కేంద్రంలో బహుజన రాజకీయ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బహుజన రాజకీయ సమితి సభ్యులు శ్రీనివాస్, ప్రభాకర్, లక్ష్మీనారాయణ, చంద్రం, కృష్ణ, శ్రావణ్, మధు తదితరులు పాల్గొన్నారు.