శివ్వంపేట, మార్చి 30: శివ్వంపేట మండలంలోని దొంతి జీవన్దివ్య గార్డెన్లో మండల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్ తెలిపారు. ఈ సమావేశానికి మంత్రి తన్నీరు హరీశ్రావు, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి, జిల్లా ఇన్చార్జి ఎగ్గె మల్లేశం, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలతా శేఖర్గౌడ్, పార్టీ శ్రేణులు హాజరుకానున్నట్టు పేర్కొన్నారు. మండలంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశారని తెలిపారు.
– హాజరుకానున్న మంత్రి హరీశ్రావు, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి