మెదక్ అర్బన్,మే 29 : రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. జిల్లాలో ఇప్పటి వరకు 4,41,563 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 2,10,095 పురుషులకు, మహిళలకు 2,31,668 ఉన్నారు. ఇప్పటి వరకు 40,728 మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. మరో 41,190 మందికి ఆర్డర్లు ఇచ్చారు. సోమవారం 86 వ రోజు 19 బృందాలు 2,616 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 304 మందికి కండ్లద్దాలను పంపిణీ చేశారు. మరో 372 మంది అద్దాల కోసం ఆర్డర్లు ఇచ్చినట్లు మెదక్ డీఎంహెచ్వో చందునాయక్ తెలిపారు.
సంగారెడ్డిలో 8926 మందికి కంటి పరీక్షలు
సంగారెడ్డి జిల్లాలో కంటి వెలుగు వైద్య శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. జిల్లా లో సోమవారం 8926 మందికి వైద్యులు కంటి పరీక్షలు చేశారు. ఇందులో 4387 పురుషులు, 4539 మహిళలు ఉన్నారు. గ్రామాల్లో 7267 మంది, పట్టణాల్లో 1300 మంది, జీహెచ్ఎంసీలో 359 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. 451 మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. 187 మందికి ప్రిస్కిప్షన్ అద్దాలకు ఆర్డర్లు ఇచ్చారు. 671 మందికి కంటి ఆపరేషన్లు చేయించుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు.