చేగుంట, జనవరి 5 : రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని, ఎన్నో ఏండ్లుగా సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు గుర్తుంపులేక పోవడంతో ప్రభుత్వం నుంచే వచ్చే బెన్ఫిట్ రాక చాలా మంది ఇబ్బందులు పడ్డారని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. గురువారం చేగుంటలో ఇబ్రహీంపూర్ సొసైటీ చైర్మన్ వంటరి కొండల్రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ పాలక వర్గం సభ్యులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
సహకారం సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ, ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రత్యేక 44వ జీవో తెవడంపై ఎంతో మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి అన్నిరాష్ర్టాల్లో సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలంటే, సీఎం కేసీఆర్ వంటి నాయకుడు దేశానికి అవసరమని, బీఆర్ఎస్ పార్టీతోనే దేశ ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పట్నం తానీషా, డైరెక్టర్లు నర్రా గణేశ్, చేరియాల సంజీవరెడ్డి, గుల్ల సిద్ధ్ది రాములు, సీఈవోలు శ్రీనివాస్, సంతోశ్ కుమార్, ఆనంద్, అనిల్, సత్తయ్య తదితరులు ఉన్నారు.