అంధత్వ నివారణకే ‘కంటి వెలుగు’
మెదక్ అర్బన్, ఏప్రిల్ 17 : అంధత్వ నివారణకు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నదని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్లో పోలీస్ సిబ్బందికి కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు. జిల్లా పోలీసులు కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నవీన్కుమార్, రాజయ్య, ఏఆర్డీఎస్పీ శ్రీనివాస్, ఆర్ఐ అచ్యుత తదితరులు పాల్గొన్నారు.
మెదక్ జిల్లాలో 3.16 లక్షల మందికి..
మెదక్, ఏప్రిల్ 17(నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 3,16,476 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 31,935 మందికి కంటి అద్దాలను పంపిణీ చేయగా, మరో 30,700 మందికి కంటి అద్దాలకు ఆర్డర్లు ఇచ్చామని డీఎంహెచ్వో చందునాయక్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 32 బృందాలు పాల్గొనగా, 56వ రోజు సోమవారం 4724 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో పురుషులు 2336 మంది కాగా, మహిళలు 2388 మంది ఉన్నారు. ఇందులో 338 మంది కంటి అద్దాలను పంపిణీ చేయ గా, 338 మందికి ఆర్డర్లు ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం జోరుగా సాగుతున్నదని అన్నారు. కంటి వెలుగు శిబిరాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల వరకు కంటి వెలుగు శిబిరాల వద్దకు వైద్య సిబ్బంది చేరుకుంటున్నారని, సాయంత్రం 4 గంటల వరకు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలో ..
సంగారెడ్డి ఏప్రిల్ 17(నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లాలో కంటి వెలుగు పరీక్షలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. సోమవారం జిల్లా అంతటా కంటి వెలుగు వైద్య శిబిరాలు జరిగాయి. వైద్య శిబిరాల్లో 13793 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 6647 మంది పురుషులు, 7146 మంది మహిళలకు కంటి పరీక్షలు చేశారు. గ్రామాల్లో 9718 మంది, మున్సిపాలిటీల్లో 3790, జీహెచ్ఎంసీలో 285 మందికి పరీక్షలు చేశారు. పరీక్ష చేయించుకున్నవారిలో 857 మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. 396 మంది పురుషులు, 461 మంది మహిళలకు అద్దాలు అందజేశారు. 828 మందికి ప్రిస్కిప్షన్ అద్దాలు ఆర్డర్ ఇచ్చారు. 1198 మందికి ఆపరేషన్లు చేయించుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు.