మెదక్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) :మెతుకు సీమలో ఇప్పటి వరకు ఏ పార్టీ అభ్యర్థి కూడా హ్యాట్రిక్ గెలుపు సాధించలేదు. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏ పార్టీ అయినా వరుసగా రెండుసార్లు మాత్రమే గెలిచింది. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టలేదు. మెదక్ నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. ఇప్పటివరకు అసెంబ్లీకి 16సార్లు ఎన్నికలు జరిగాయి. ఆరుసార్లు (టీడీపీ), ఐదుసార్లు (కాంగ్రెస్), రెండు సార్లు (బీఆర్ఎస్) పార్టీలకు చెందిన వారు ప్రాతినిధ్యం వహించారు. జనతా పార్టీ, సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు ఒక్కోసారి గెలుపొందారు. 30 ఏండ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ గెలుపొందారు. 1989లో కాంగ్రెస్ నుంచి నారాయణరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు ఎవరూ గెలుపొందలేదు. సుమారు 34 ఏండ్ల తర్వాత మళ్లీ 2023లో కాంగ్రెస్కు చెందిన మైనంపల్లి రోహిత్ గెలుపొందారు.
మెతుకు సీమలో ఇప్పటి వరకు హ్యాట్రిక్ కొట్టిన పార్టీ లేదంటే అవుననే సమాధానం వస్తుంది. ఇప్పటి వరకు ఏ పార్టీ అయినా వరుసగా రెండుసార్లు మాత్రమే గెలిచింది తప్ప మూడోసారి హ్యాట్రిక్ కొట్టలేదు. మెదక్ నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. ఇప్పటి వరకు అసెంబ్లీకి 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఆరుసార్లు (టీడీపీ), ఐదుసార్లు (కాంగ్రెస్) పార్టీ, రెండు సార్లు(బీఆర్ఎస్) పార్టీలకు చెంది న వారు ప్రాతినిధ్యం వహించారు. జనతా పార్టీ, సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు ఒక్కోసారి గెలుపొందారు. 1972లో కరణం రామచంద్రరావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. 2002లో మంత్రిగా కొనసాగిన కరణం రామచంద్రరావు మరణంతో ఉప ఎన్నికల్లో కరణం భార్య ఉమాదేవి టీడీపీ తరపున పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత 2004లో జనతా పార్టీ నుం చి పట్లోళ్ల శశిధర్రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో టీడీపీ నుంచి మైనంపల్లి హన్మంతరావు గెలుపొందగా, 2014లో బీఆర్ఎస్ నుంచి పద్మాదేవేందర్రెడ్డి విజయం సాధించి శాసనసభ తొలి డిప్యూటీ స్పీకర్గా వ్యవహరించారు. అనంతరం 2018లో పద్మాదేవేందర్రెడ్డి రెండోసారి గెలుపొందారు.
17 సార్లు ఎన్నికలు.. ఏ పార్టీకి హ్యాట్రిక్ రాలేదు
మెదక్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 1952లో కాంగ్రెస్ పార్టీ నుంచి వెంకటేశ్వర్రావు 15,030 ఓట్లతో గెలుపొందారు. 1957లో కాంగ్రెస్ పార్టీ నుంచి వెంకటేశ్వర్రావు 10,564 ఓట్లతో గెలిచారు. 1962లో సీపీఐ నుంచి ఆనందాదేవి 20,874 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1967లో కాంగ్రెస్ పార్టీ నుంచి రాంచంద్రారెడ్డి 16,251 ఓట్లతో గెలుపొందారు. 1972లో స్వతంత్ర అభ్యర్ధి కరణం రామచందర్రావు 18,017 ఓట్లతో గెలుపొందారు. 1978లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్.లక్ష్మారెడ్డి 34,464 ఓట్లతో గెలుపొందారు. 1983లో టీడీపీ నుంచి కరణం రామచంద్రరావు 30,950 ఓట్లతో గెలిచారు. 1985లో టీడీపీ నుంచి కరణం రాంచందర్రావు 45,320 ఓట్లతో గెలుపొందారు. 1989లో కాంగ్రెస్ నుంచి నారాయణరెడ్డి 51,990 ఓట్లతో గెలిచారు. 1994లో టీడీపీ నుంచి కరణం రామచంద్రరావు 58,307 ఓట్లతో గెలుపొందారు. 1999లో టీడీపీ నుంచి కరణం రామచంద్రరావు 61,216 ఓట్లతో విజయం సాధించారు. 2002 ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి ఉమాదేవి 43,463 ఓట్లతో విజయం సాదించింది. 2004లో పి.శశిధర్రెడ్డి జనతా పార్టీ నుంచి 43,369 ఓట్లతో గెలుపొందారు. 2009లో టీడీపీ నుంచి మైనంపల్లి హన్మంతరావు 57,942 ఓట్లతో గెలుపొందారు. 2014లో బీఆర్ఎస్ నుంచి ఎం.పద్మాదేవేందర్రెడ్డి 89,654 ఓట్లతో విజయం సాధించారు. తిరిగి రెండో సారి 2018లో బీఆర్ఎస్ నుంచి ఎం.పద్మాదేవేందర్రెడ్డి 97,670 ఓట్లతో గెలుపొందారు.
30 ఏళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్ గెలుపు
1989లో మెదక్ అసెంబ్లీకి ఎన్నికలు జరగగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి నారాయణరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్ధులు ఎవ్వరూ గెలుపొందలేదు. సుమారు 34 ఏండ్ల తర్వాత మళ్లీ 2023లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనంపల్లి రోహిత్ గెలుపొందారు. బీఆర్ఎస్ సర్కారు 2014లో ఎం.పద్మాదేవేందర్రెడ్డి 39,600 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, రెండోసారి 2018లో బీఆర్ఎస్ నుంచి ఎం.పద్మాదేవేందర్రెడ్డి 47,983 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2023లో బీఆర్ఎస్ అభ్యర్ధి పద్మాదేవేందర్రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించలేదు. దీంతో మెతుకు సీమలో ఏ పార్టీ కూడా హ్యాట్రిక్ విజయం సాధించలేదని చెప్పవచ్చు.