జిల్లాలో పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులు గురువారం అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. ఆయా నియోజకవర్గాల్లోని ఆలయాల్లో కుటుంబసమేతంగా ప్రత్యేక పూజలు చేసి, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య నియోజకవర్గ రిటర్నింగ్ కార్యాలయాలకు భారీ ర్యాలీతో బయలుదేరారు. సంగారెడ్డిలో చింతా ప్రభాకర్, పటాన్చెరులో ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్రెడ్డి, జహీరాబాద్లో ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు పండుగ వాతావరణంలో నామినేషన్లు వేశారు. ఇప్పటివరకు జిల్లాలో 94 మంది 120 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం చివరిరోజు కావడంతో పెద్దసంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నదని అధికారులు
భావిస్తున్నారు.
పటాన్చెరు, నవంబర్ 9: బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి నామినేషన్ను పురస్కరించుకుని గురువారం వేలాదిమంది ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పటాన్చెరుకు తరలివచ్చారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తల్లి మణెమ్మ, అక్కచెల్లెళ్ల ఆశీస్సులు తీసుకుని పట్టణంలోని పంచముఖి హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. చైతన్యనగర్లోని హనుమాన్ ఆలయంలోనూ పూజలు చేసి, అనంతరం సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. రుద్రారం పరిధిలోని సిద్ధి వినాయక దేవస్థానంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు ప్రత్యేక ఆశీస్సులు అందజేయగా, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే ర్యాలీగా నామినేషన్కు బయలుదేరారు. రుద్రారం సర్పంచ్, పాలకవర్గం, దేవాలయ కమిటీ ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. రుద్రారం, లక్డారం గేట్, ఇస్నాపూర్ చౌరస్తా, ముత్తంగి నుంచి పటాన్చెరు పట్టణం వరకు భారీ కారు ర్యాలీ కొనసాగింది. ఎమ్మెల్యేను స్థానికులు ఘనంగా సత్కరించారు. రోడ్డు పొడవునా అభిమానులు గులాబీ పూలను చల్లి ప్రేమను చాటుకున్నారు. ఎమ్మెల్యేతోపాటు శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్లు సఫాన్దేవ్, శంకర్యాదవ్ ఎమ్మెల్యేతో పాటు ర్యాలీలో బయలుదేరారు. పటాన్చెరు పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యేతోపాటు గులాబీ శ్రేణులు అంబేద్కర్ చౌరస్తానుంచి ఎన్నికల అధికారి కార్యాలయం వరకు పాదయాత్రగా తరలివచ్చారు. గులాబీశ్రేణుల సందడితో పటాన్చెరు పట్టణం గులాబీమయంగా మారింది.
మహిళా నాయకురాలు గూడెం యా దమ్మ నేతృత్వంలో మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు పట్టణంలో కదం తొక్కారు. పటాన్చెరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దేవుజాకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆర్వో కార్యాలయంలో నామినేషన్ సమర్పించి ఎమ్మెల్యే ఎన్నికల ప్రతిజ్ఞ చేశారు. ఎమ్మెల్యే సతీమణి యాదమ్మ కూడా ఒకసెట్ నామినేషన్ వేశా రు. అనంతరం ఎమ్మెల్యేను పార్టీ వర్గాలు ఊరేగింపుగా జీఎమ్మార్ కన్వెన్షన్హాల్ వరకు తీసుకెళ్లారు. భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ అభిమానులకు, ప్రజలకు ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ విజయ్కుమార్, ఆత్మకమిటీ చైర్మన్ గడీల కుమార్గౌడ్, జడ్పీటీసీ సుప్రజావెంకట్రెడ్డి, కుమార్గౌడ్, సుధాకర్రెడ్డి, ఎంపీపీలు సుష్మశ్రీవేణుగోపాల్రెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్యాదవ్, పుష్పానగేశ్, సింధూఆదర్శ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు తుమ్మల పాండురంగారెడ్డి, లలితాసోమిరెడ్డి, కొలన్ రోజాబాల్రెడ్డి, యువత రాష్ట్ర నాయకులు వెంకటేశ్గౌడ్, పటాన్చెరు మండల వైస్ చైర్మన్ స్వప్నాశ్రీనివాస్, మాజీ ఎంపీపీలు యాదగిరియాదవ్, శ్రీశైలంయాదవ్, అమీన్పూర్ వైస్చైర్మన్ నర్సింహాగౌడ్, గూడెం మధుసూదన్రెడ్డి, సర్పంచ్లు సుధీర్రెడ్డి, ఉపేందర్, చంద్రారెడ్డి, అఫ్జల్, మె రాజ్ఖాన్, అశోక్, ఉపసర్పంచ్ వడ్డే కుమార్, మాజీ సర్పంచ్ వెంకట్రెడ్డి, వీరేశం,శకీల్, నర్సింహ, రవీందర్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
సంగారెడ్డి, నవంబర్ 9: నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నుంచి పెద్దమొత్తంలో వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఆరోరోజు 16 నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ నామినేషన్ను రిటర్నింగ్ అధికారి రవీందర్రెడ్డికి అందజేశారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్రెడ్డి(జగ్గారెడ్డి) నామినేషన్ వేశారు. వీరితోపాటు బీజేపీ అభ్యర్థులుగా పులిమామిడి రాజు, రాజేశ్వర్రావు దేశ్పాండే తమ నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా ఏకంగా 10మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున తోట నర్సింహులు, తెలంగాణ ప్రజాశక్తి పార్టీ నుంచి దొడ్ల వెంకటేశం, స్వతంత్రలుగా హరికాంత్రెడ్డి, కోల్కూర్ ప్రతాప్, వెంకట్రెడ్డి, బంగారు కృష్ణ, సుకూరి జగదీశ్వర్, సట్కుల ఆంజనేయులు, కిరణ్ రాథోడ్, పోలీస్ రాంచంద్రయ్య, షేక్ జహూర్, రమేశ్యాదవ్ నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. మొత్తం 16మంది అభ్యర్థులు 19 సెట్ల నామినేషన్లు వేశారు. శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగియనుంది. మధ్యాహ్నం 3గంటలలోగా రాజకీయ పార్టీల అభ్యర్థులు తప్పని సరిగా బీ-ఫామ్స్ ఎన్నికల అధికారికి అందజేయాలని సూచించారు.
జహీరాబాద్, నవంబర్ 9: జహీరాబాద్ శాసన సభ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కొనింటి మాణిక్రావు నామినేషన్ దాఖలు చేశారు. గురువారం జహీరాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకారెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే మాణిక్రావు బీఆర్ఎస్ కార్యాలయంలో నుంచి భారీ వాహనాలతో ర్యాలీగా సీడీసీ కార్యాలయానికి చేరుకుని, అక్కడి నుంచి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లారు. ఎమ్మెల్యే మాణిక్రావు తరఫున టీఎస్ఐడీసీ చైర్మన్ తన్వీర్, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మాల్కాపూరం శివకుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు గుండప్ప, రామకృష్ణారెడ్డి వెళ్లారు. బీఆర్ఎస్ అభ్యర్థి తరఫున మరో నామినేషన్ను ఆత్మకమిటీ చైర్మన్ పెంటారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు డప్పుర్ రవీందర్, తంజీం, మంకల్ సుభాశ్, వెంకటేశం, మరో నామినేషన్ను విజయ్మోహన్రెడ్డి, అల్లాడి నర్సింహులు, భాస్కర్, కిషన్ పవార్, నర్సింహులు దాఖలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొనింటి మాణిక్రావు నామినేషన్ వేసేందుకు నియోజకవర్గంలోని జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాల్కల్, కోహీర్, ఝరాసంగం మండలాలకు చెందిన నాయకులు హాజరయ్యారు. బేవరేజస్ కార్పొరేషన్ చైర్మన్, ఎన్నికల ఇన్చార్జి దేవీప్రసాద్ నామినేషన్ దాఖలు ప్రక్రియను పర్యవేక్షించారు. జహీరాబాద్ సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ మాణిక్రావును ఘనంగా సన్మానం చేశారు. నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.