పుల్కల్, జనవరి 12: బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి పారుదలశాఖ అధికారులు శుక్రవారం ఘనపూర్ ఆయకట్టుకు నీటి ని విడుదల చేశారు. ప్రతి సంవత్సరం ఇదే సమయంలో ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే జల విద్యుత్ కేంద్రం నుంచి 2,667 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశామని నీటి పారుదలశాఖ డిప్యూటీ డీఈ నాగరాజు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నది పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు, రైతులు, గొర్లకాపరులు అటువైపు వెళ్లకూడదని హెచ్చరించారు. ప్రాజెక్టు సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 24.775 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.