జహీరాబాద్, ఫిబ్రవరి 4 : పంటలు సాగు చేసేందుకు పొలంలో వేసిన బోరుబావుల నుంచి ఫ్యాక్టరీలకు నీటిని తరలిస్తూ కొందరు సొమ్ముచేసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా 65వ జాతీయ రహదారిపై చిరాగ్పల్లి -సత్వార్ శివారు మధ్యలో వ్యవసాయ క్షేత్రం నుంచి ఓ పరిశ్రమకు నిత్యం నీటిని ట్యాంకర్ ద్వారా సరఫరా చేస్తున్నారు.పంటలు సాగు చేసేందుకు పొలంలో వేసిన బోరుబావుల నుంచి ఫ్యాక్టరీలకు నీటిని తరలిస్తూ కొందరు సొమ్ముచేసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా 65వ జాతీయ రహదారిపై చిరాగ్పల్లి -సత్వార్ శివారు మధ్యలో వ్యవసాయ క్షేత్రం నుంచి ఓ పరిశ్రమకు నిత్యం నీటిని ట్యాంకర్ ద్వారా సరఫరా చేస్తున్నారు. నీటి వ్యాపారం చేయాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, చిరాగ్పలి-సత్వార్ శివారు మధ్యలోని ఒ పొలం నుంచి ప్రతి రోజూ ట్యాంకర్ ద్వారా నీటిని ఫ్యాకరీకి తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులను మచ్చిక చేసుకొని అక్రమంగా నీటి వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పంటలు సాగు చేసేందుకు బోరు వేసి, విద్యుత్ కనెక్షన్ తీసుకొని మామిడి చెట్లు పెంపకం చేస్తున్నారు. మామిడి చెట్లు పెంపకంతో పాటు బోరు నీటితో వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తు న్నది. ప్రతి రోజు వందల ట్యాంకర్ల నీటిని పరిశ్రమకు తరలిస్తున్నట్లు స్థానికులు తెలుపు తున్నారు.
ఈ వ్యవసాయక్షేత్రంలోని బోరుకు విద్యుత్ అధికారులు ప్రత్యేకంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి, మోటర్ బిగించారు. అధికారులు వ్యవసాయ బోరుకు పెట్టిన మో టర్ పని చేస్తుందా.. లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ నీటి వ్యా పారానికి ప్రభుత్వ అనుమతి ఉందా, ఒకవేళ లేకపోతే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు వ్యక్తమవు తున్నాయి. సంబంధిత అధి కారులు విచారణ చేపట్టి చర్యలు తీసు కోవాలని స్థానికులు కోరు తున్నారు. ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నది. దీనికి కేవలం పంటల సాగుకు మాత్రమే వినియోగిం చుకోవాలి. అలా కాదని వ్యవసాయ బోరు బావుల నుంచి ఉచిత విద్యుత్ ఆధారంగా ట్యాంకర్ల ద్వారా ఫ్యాక్టరీలకు నీటిని సరఫరా చేయడం చట్టరీత్యా నేరం.