చిన్నకోడూరు, జనవరి 06 : కుటుంట కలహాలతో కట్టుకున్న భర్తను ఓ భార్య గొడ్డలితో నరికి చంపిన సంఘటన సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలం విఠలాపూర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. సిద్దిపేట రూరల్ సీఐ సురేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. విఠలాపూర్ గ్రామానికి చెందిన మర్కంటి నర్సవ్వ, ఎల్లయ్య(65) భార్యాభర్తలు.
గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో తరుచూ గొడవ పడుతున్నారు. అయితే గురువారం ఉదయం 3 గంటల సమయంలో నిద్ర పోతున్న ఎల్లయ్యను భార్య నర్సవ్వ గొడ్డలితో మెడపై నరకగా, తీవ్ర గాయాలైన నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకిరించారు. మృతుడి కూతురు రేణుక ఫిర్యాదు మేరకు నిందితురాలు నర్సవ్వను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సీఐ సురేందర్రెడ్డి, చిన్నకోడూరు ఎస్సై రాజేశ్ తెలిపారు.