సిద్దిపేట, జనవరి 2 : వ్యవసాయ, ఉద్యానవన ఆయిల్ఫెడ్ అధికారుల సమన్వయ కృషితో జిల్లాలో ఆయిల్పామ్ సాగు కోసం రైతులు ముందుకు వచ్చి డీడీలు కట్టడం ఆహ్వానించదగిన విషయమని మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం జిల్లాలోని వ్యవసాయ, ఉద్యానవన, ఆయిల్ఫెడ్ 500 మంది రైతులతో ఆయిల్పామ్ సాగుపై మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 3400 ఎకరాల్లో రైతులు ఆయిల్పామ్ సాగు చేశారని తెలిపారు. ప్రస్తుతం 1346 ఎకరాల్లో సాగుకు సరిపడా డ్రిప్ కోసం రైతులు డీడీలు కట్టారని, ఇందులో 305 ఎకరాలకు సరిపడా డ్రిప్ మెటీరియల్ను పంపిణీ చేశామన్నారు. మరో 1041 ఎకరాలకు డ్రిప్ మెటీరియల్ను రైతులకు పంపిణీ చేయనున్నామన్నారు. రైతుల డ్రిప్ వచ్చిన వెంటనే మొక్కలు తీసుకెళ్లి ఒకేసారి గుంతలు తీసుకొని డ్రిప్ వేసి మొక్కలు నాటడంతో కూలీలను పెట్టుకుంటే సమయం, ఆదాయం జిల్లాలో వేగంగా ఆయిల్పామ్ సాగు విస్తరణ పూర్తవుతుందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.