అల్పపీడన ప్రభావంతో జిల్లాలో వారం రోజులుగా కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. గురువారం జిల్లాలో 93.4 మి.మీటర్ల సరాసరి వర్షపాతం నమోదైంది. అత్యధికంగా హుస్నాబాద్ మండలంలో 186.2 మి.మీటర్లు, అత్యల్పంగా మద్దూర్లో 43.2 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటివరకు జిల్లాలో 2,427.3 మి.మీటర్ల వర్షం కురిసింది. రోజంతా వర్షం పడడంతో వరద పోటెత్తుతున్నది. వాగులు, వంకలు పొంగుతున్నాయి. చెరువులు అలుగు పారుతున్నాయి. మోయతుమ్మెద, హల్దీ, కూడవెల్లి, సిద్దిపేట వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 2271 చెరువులకు 714 అలుగు పారుతున్నాయి. మరో 882 చెరువుల్లోకి 75శాతానికిపైగా నీరు వచ్చి చేరింది. కాజ్వేల మీదుగా వరద ప్రవహించడంతో వాహనాలను దారి మళ్లించారు. పలుచోట్ల కాలనీలు, పంట పొలాలు నీట మునిగాయి. జిల్లా అధికార యంత్రాంగానికి ఎప్పటికప్పడు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు దిశానిర్దేశం చేస్తున్నారు.
శ్వేత ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ప్రతి మండలకేంద్రంలో
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వర్షాలకు ప్రజలు పెద్దఎత్తున చెరువు అలుగుల వద్ద చేపలు పడుతున్నారు. జిల్లాలోని ప్రధాన మినీట్యాంక్ బండ్లయిన సిద్దిపేట కోమటి చెరువు, గజ్వేల్ పాండవుల చెరువు, చేర్యాల పెద్ద చెరువు, హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులు నిండి మత్తడి దుంకుతున్నాయి.
– సిద్దిపేట, జూలై 27( నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సిద్దిపేట, జూలై 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వారం రోజులుగా జిల్లాలో కుండపోత వర్షం కురుస్తున్నది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు అలుగులు పారుతున్నాయి. మోయతుమ్మెద, హల్ద్దీ, కూడవెల్లి, సిద్దిపేట వాగుతోసహా జిల్లాలోని అన్ని వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల కాజ్వేల మీదుగా వరద నీరు పోవడంతో వాహనాలను దారి మళ్లీంచారు. పలుచోట్ల కాలనీలు, పంట పొలాలు నీట మునిగాయి. జిల్లా అధికార యంత్రాంగానికి ఎప్పటికప్పడు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు దిశానిర్దేశం చేస్తున్నారు. మంత్రి ఆదేశాలతో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, పోలీస్ కమిషనర్ శ్వేత అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రతి మండలకేంద్రంలో అధికారులు, ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని ప్రధానమైన మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో దానిపై నిర్మించని చెక్డ్యామ్లు పొంగిపొర్లుతున్నాయి. సిద్దిపేట -హన్మకొండ రహదారిపై కోహెడ మండలం బస్వాపూర్ వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. పందిల్ల వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది.
నంగునూరు మండలకేంద్రం, అక్కెనపల్లి నుంచి బస్వాపూర్ వెళ్లే మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. సిద్దిపేట -జనగామ జాతీయ రహదారి వీరన్నపేట వద్ద రోడ్డు కొట్టుకుపోవడంతో దారి మళ్లించారు. చేర్యాల -యాదగిరిగుట్ట రహదారి, మద్దూరు మండలంలోని ఈదుల వాగు, కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అల్వాల బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేసి ఇతర మార్గాల్లో పంపిస్తున్నారు. అక్కన్నపేట మండలంలోని పలు చెరువులు, వాగులు పొంగిపొర్లుతుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు బందయ్యాయి. వర్షాలకు ప్రజలు పెద్దఎత్తున చెరువు అలుగులు వద్ద చేపలు పడుతున్నారు. ఒక్కో చేప 10 కిలోల ఉన్నాయి. జిల్లాలోని ప్రధాన మినిట్యాంక్బండ్ చెరువులైన సిద్దిపేట కోమటి చెరువు, గజ్వేల్ పాండవుల చెరువు, చేర్యాల పెద్ద చెరువు, హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులు అలుగులు పారుతున్నాయి. సిద్దిపేట జిల్లావ్యాప్తంగా గురువారం భారీ వర్షం కురిసింది. జిల్లాలో మొత్తం 2427.3 మి.మీటర్ల సరాసరి వర్షపాతం నమోదైంది. అత్యధికంగా హుస్నాబాద్ మండలంలో 186.2 మి.మీటర్లు, అత్యల్పంగా మద్దూర్ 43.2 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది.