అక్కన్నపేట, నవంబర్ 26: ఆయిల్పామ్ సాగుతో లాభాలు పొందవచ్చని ఎంపీపీ మాలోత్ లక్ష్మీబీలూనాయక్ అన్నారు. శనివారం మండలంలోని కట్కూరులోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆయిల్పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ జిల్లెల అశోక్రెడ్డి, రైతు బంధు సమితి కోఆర్డినేటర్ జిల్లెల గాల్రెడ్డి, ఎంపీటీసీ భూపతి సుదేష్ణ, సింగిల్ విండో వైస్ చైర్మన్ ముకుందారెడ్డి, మాజీ జడ్పీటీసీ మాలోత్ బీలూనాయక్, ఏఈవో, రైతులు పాల్గొన్నారు.
గిరిపల్లిలో…
ఆయిల్ పామ్ సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని ఏడీఏ బాలునాయక్, ఏవో నాగరాజు అన్నారు. శనివారం మండలంలోని గిరిపల్లిలో రైతు అంజిరెడ్డికి చెందిన ఆయిల్పామ్ పంటను వారు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం ఎకరాకు 57 మొక్కలను సబ్సిడీపై రూ.20 చొప్పున అందిస్తున్నారు. గుంతలను ఉపాధి హామీ పథకం ద్వారా తీయించడం జరుగుతుందన్నారు. పంటను సాగు చేసిన తర్వాత మూడేండ్ల పాటు ఎకరాకు రూ.4200 ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ఆయిల్పామ్సాగుతో మంచి లాభాలు ఉంటాయని, అందుకు రైతులు మందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఏఈవో వెన్నెల, రైతులు పాల్గొన్నారు.