సిద్దిపేట టౌన్, మార్చి 30 :పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన చేధించాలని డీజీపీ మహేందర్రెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. పెండింగ్ కేసులపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలీసు అధికారులు యూఐ కేసులను చాలెంజ్గా తీసుకొని లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. 2015-16 సంవత్సరంలో ఉన్న గ్రేవ్ కేసులు, పెండింగ్లో ఉన్న వాటిని త్వరగా ఇన్వెస్ట్గేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేయాలని పేర్కొన్నారు. పిటీషన్ ఎంక్వైరీ రిపోర్టును పిటీషన్ మాడ్యూల్లో అప్లోడ్ చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న ఓఈ గురించి మేళా నిర్వహించి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల్లో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్ట్గేషన్ ఉండాలన్నారు. పోక్సో, క్రైమ్ అగనెస్ట్ ఎస్సీ, ఎస్టీ కేసుల్లో శిక్షణ శాతాన్ని పెంచే విధంగా కోర్టు డ్యూటీ కానిస్టేబుళ్లు వారిని మోటివేట్ చేసి, ట్రయల్ సమయంలో ప్రతిరోజు అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు.
క్రైమ్ ఎగనెస్ట్, ఉమెన్, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులను త్వరలో ఇన్వెస్ట్గేషన్ పూర్తి చేయాలన్నారు. ప్రతి కేసును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషనర్లు పర్యవేక్షిస్తారని తెలిపారు. అండర్ ఇన్వెస్ట్గేషన్ కేసులు తగ్గించాలని, దొంగతనాల కేసులు త్వరగా ఛేదించాలని సూచించారు. నాన్బెయిలబుల్ వారెంట్, సమన్స్ సీసీటీఎన్ఎస్ సిస్టమ్లో అప్లోడ్ చేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న నాన్బెయిల్ వారెంట్లు త్వరగా ఎగ్జిక్యూట్ చేయాలన్నారు. పంక్షనల్, వర్టికల్, బ్లూకోట్స్, పెట్రోల్కార్, స్టేషన్ రైటర్, క్రైమ్ వర్టికల్, టెక్టిమ్, కోర్టు డ్యూటీ ఆఫీసర్స్, స్టేషన్ ఇన్చార్జి తదితర వారు నిర్వహించే విధుల గురించి రాష్ట్రస్థాయి డాటాను, సీసీటీఎన్ఎస్ సిస్టమ్ ద్వారా నమోదైన డాటాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు.
ఉత్తమ విధులు నిర్వర్తించిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రతినెలా రివార్డు మేళా నిర్వహించి రివార్డులు అందించాలని అధికారులకు సూచించారు. రివార్డులు అందజేయడంతో రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. అంతకు ముందు సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ జిల్లాలో పెండింగ్లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులను వివరించారు. ప్రతిరోజు పెండింగ్లో ఉన్న కేసులపై రివ్యూ చేయడం జరుగుతుందని తెలిపారు. అండర్ ఇన్వెస్ట్గేషన్ కేసులను చేధించినందుకు పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ను, పోలీసు అధికారులు, సిబ్బందిని డీజీపీ మహేందర్రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. వీడియో కాన్ఫరెన్స్లో ఏసీపీలు రామేశ్వర్, మహేందర్, నారాయణ, సీఐలు శ్రీనివాస్, ప్రవీణ్కుమార్, ఎస్సైలు ముఖేద్ఫాషా, కోర్టు లైజనింగ్ ఏఎస్సై స్వామిదాస్, హెడ్ కానిస్టేబుల్ మిస్బావుద్దీన్, కానిస్టేబుళ్లు శశికాంత్, శ్రీధర్, విజయ్, రాజిరెడ్డి, సీసీ కెమెరాల ఆపరేటర్లు పరందాములు, కానిస్టేబుల్ భాస్కర్ పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి..
ఈ లక్షణాలు మీలో ఉంటే.. మీరు ఉప్పు ఎక్కువగా తింటున్నట్లే..!
రోగ నిరోధక శక్తి పెంచే జ్యూస్లు ఇవే..