సిద్దిపేట కలెక్టరేట్, జూన్ 16 : ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని పక్కాగా అమలు చేస్తూ.. కొత్త చట్టానికి ప్రతిరూపంగా సిద్దిపేట జిల్లాను నిలుపాలని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి సూ చించారు. బుధవారం సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో పలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైకుంఠధామం, డం పింగ్యార్డు, పల్లె పకృతి వనాలు, నర్సరీలు, హరితహారం, స్వచ్ఛ భారత్, పలు అంశాలపై దృష్టి సా రించాలన్నారు. క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు. కొంతమంది అధికారులు స్థానికంగా కాకుండా ఇతర ప్రాంతాల్లో నివాసముంటూ విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వహిస్తున్నారని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు స్థానికంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతిఒక్కరూ నిబద్ద్దతతో పనిచేయాలన్నారు.
అధికారులు వారానికి నాలుగు సార్లు గ్రామాల్లో పర్యటించాలన్నారు. ప్రజలతో మమేకమై గ్రామంలో కలియతిరిగి సమస్యలను పరిష్కరించాలన్నారు. త్వరలో సీఎం కేసీఆర్ గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టే అవకాశం ఉన్నందున, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నా రు. పంచాయతీ కార్యదర్శులు గ్రామానికి దూరంగా ఉన్నవారు స్వస్థలాలకు చేరువగా ఏవైనా అవకాశాలు ఉన్నచోట ఉద్యోగ స్థానాన్ని మార్పులు చేసుకోవాలని, అందుకు తోడ్పాటునందిస్తామన్నారు. వానకాలం నేపథ్యంలో స్వచ్ఛభారత్ను చేపట్టాలన్నారు. ప్రతి సోమవారం టూర్ డైరీని అదనపు కలెక్టర్తోపాటు తనకు సమర్పించాలన్నారు. బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరు ఉండేవిధంగా ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ చాంబర్లో ఒక వ్యక్తి వీటన్నీంటి కోసం ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. అంతకుముందు వరంగల్ నుంచి పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, హైదరాబాద్ నుంచి సీఎస్ సోమేశ్ కుమార్ పట్టణ ప్రగతిలోని పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు విషయాలను తెలుసుకున్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, డీఆర్వో చెన్నయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.