సిద్దిపేట జోన్/చేర్యాల/ గజ్వేల్/ హుస్నాబాద్/ దుబ్బాక, మే 14 : ప్రభు త్వం కరోనాను నియంత్రించడానికి విధించిన లాక్డౌన్ జిల్లావ్యాప్తంగా శుక్ర వారం మూడో రోజూ సంపూర్ణంగా కొనసాగింది. ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్డౌన్కు సహకరిస్తున్నారు. ఉదయం 10 గంటల వరకు మార్కెట్ల లో నిత్యావసర సరుకుల దుకాణాలు తెరిచి ఉండడంతో ప్రజలు మార్కెట్లకు వెళ్తున్నారు. 10 గంటల తర్వాత జిల్లా లోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.