చేర్యాల, ఆగస్టు 16 : ఈ నెల 23వ తేదీన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో కోరమీసాలు, ఇతర మొక్కుబడి వస్తువుల విక్రయ హక్కుల కోసం సీల్డు టెండర్లు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ మంగళవారం తెలిపారు.
ఆసక్తిగల వ్యాపారులు ఈ నెల 22వ తేదీ లోగా షెడ్యూల్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆయనతో పాటు ఏఈవో వైరాగ్యం అంజయ్య, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, సూపరింటెండెంట్ నీల శేఖర్ తదితరులున్నారు.