సిద్దిపేట: జిల్లాలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఓ విద్యుత్ సబ్స్టేషన్లో చోరీ జరిగింది. జిల్లాలోని మిరుదొడ్డి మండలం ధర్మారం సబ్స్టేషన్లో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. సబ్స్టేషన్లోని 5 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్లో 2,320 కిలోల కాపర్, 300 లీటర్ల ఆయిల్ను ఎత్తుకెళ్లారు. విషయాన్ని గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మిరుదొడ్డి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.