చేర్యాల, జూలై 12 : సీఎం కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా జీవనం సాగిస్తున్నారని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అవసరం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యలు చేయ డం.. కాంగ్రెస్ పార్టీ అసలు రూపం బయటపడిందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదని రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం జనగామ-సిద్దిపేట జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతు కాబట్టి.. రైతులకు 24గంటలపాటు ఉచిత కరెంట్ ఇస్తున్నారని తెలిపారు. అమెరికాలో జరిగిన సమావేశంలో రేవంత్రెడ్డి మూడు గంటల కరెంట్ సరిపోతుందని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఇండ్లకు సున్నాలు వేస్తూ బ్లాక్ మెయిలింగ్ విధానాలతో రాజకీయాల్లోకి వచ్చి, పూటకో పార్టీ మారిన రేవంత్రెడ్డికి రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో కాలిపోయిన మోటర్లు, పేలిపోయిన ట్రాన్స్పార్మర్లతో రైతన్నలు ఇబ్బంది పడేవారన్నారు.
రాత్రిపూట కరెంట్ మోటర్లు పెట్టేందుకు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి పాము, తేలు కరిచి, విద్యుత్ షాక్తో ఎంతో మంది రైతులు చనిపోయారని తెలిపారు. రైతన్నల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ 24గంటల పాటు ఉచిత కరెంట్, ఎరువులు, విత్తనాలు ఇస్తున్నారన్నారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులు, వసతులపై రేవంత్రెడ్డి ఒక్కరోజు పార్లమెంట్లో మాట్లాడలేదని, అసలు తెలంగాణ ప్రయోజనాలు పట్టని రేవంత్రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణ రైతులను అవమానించేలా వ్యవహరిస్తున్న కాంగ్రెస్కు రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చా రు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వరూపరాణిశ్రీధర్రెడ్డి, ఎంపీపీ కరుణాకర్, ఏఎంసీ వైస్చైర్మన్ పుర్మ వెంకట్రెడ్డి, వైస్ ఎంపీపీ నవీన్రెడ్డి, గ్రంథాలయ కమిటీ జిల్లా సభ్యుడు మేడిశెట్టి శ్రీధర్, సర్పంచ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు పెడుతల ఎల్లారెడ్డి, గూడూరు బాలరాజు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఉల్లెంగల ఏకానందం, టౌన్ అధ్యక్షుడు ముస్త్యాల నాగేశ్వర్రావు, కౌన్సిలర్లు ఆడెపు నరేందర్, మంగోలు చంటి, మండల రైతు కోఆర్డినేటర్ తాడెం రంజితాకృష్ణమూర్తి, బీఆర్ఎస్వై నాలుగు మండలాల ఇన్చార్జి శివగారి అంజయ్య, కోతి దాసు పాల్గొన్నారు.