CP B Anuradha | రాయపోల్ మార్చి 29 : దౌల్తాబాద్, రాయపోల్ పోలీస్ స్టేషన్లను ఇవాళ జిల్లా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలను, సీజ్ చేసిన వాహనాలను, రిసెప్షన్ రికార్డ్, రైటర్ రూమ్ పరిశీలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. పోలీస్ స్టేషన్లో వివిధ కేసులలో ఉన్న వాహనాల అడ్రస్ తెలుసుకుని సంబంధిత యజమానులకు త్వరగా అప్పగించాలని సంబంధిత ఎస్ఐలకు సూచించారు.
అధికారులు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని సుచించారు. ప్రజల రక్షణ ధ్యేయంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి సాధ్యమైనంత త్వరగా వారి సమస్యలు పరిష్కరించాలి. ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ బెట్టింగ్ లాంటి వాటిపై నిఘా పెంచాలని తెలిపారు.
ఇసుక, జూదం, పీడీఎస్ రైస్ అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలు, పోలీస్ స్టేషన్ రికార్డ్స్, సీడీ ఫైల్స్ తనిఖీ చేశారు ప్రతీ రికార్డ్ అప్డేట్ ఉండాలని అధికారులు, సిబ్బందికి సూచించారు.
రాయపోల్ పోలీస్ స్టేషన్లో రికార్డ్స్ సీసీటీఎన్ఎస్ డాటా అప్డేట్ ఉన్నందున అధికారులను, సిబ్బందిని అభినందించారు. పోలీస్ సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకుని ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
విజిబుల్ పోలీసింగ్ పై దృష్టి సారించాలి..
పోలీస్ అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి నీతి నిజాయితీగా విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. (వీపీఓ) విలేజ్ పోలీస్ ఆఫీసర్ కేటాయించిన గ్రామాలకు కేటాయించిన వార్డులను తరచుగా సందర్శిస్తూ ఇన్ఫర్మేషన్ వ్యవస్థను మెరుగుపరుచుకోవాలని సూచించారు.
విజిబుల్ పోలీసింగ్ పై దృష్టి సారించాలని ఉదయం సాయంత్రం విసేబుల్ పోలీసింగ్ విధులు నిర్వహించాలని అధికారులకు సిబ్బందికి సూచించారు. సిబ్బంది విధి నిర్వహణతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని సూచించారు. సమయం దొరికినప్పుడల్లా వాకింగ్, రన్నింగ్ యోగా చేస్తూ ఉండాలని.. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని తెలిపారు.
పాత నేరస్తులపై నిఘా ఉంచాలని తెలిపారు. డ్రగ్స్.. దాని ప్రభావం, సైబర్ నేరాలు తదితర అంశాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి తగు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి అవసరమైన ప్రదేశాలలో బ్లాక్ స్పాట్స్ వద్ద ఆర్ అండ్ బి అధికారుల సమన్వయంతో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి, తొగుట సీఐ లతీఫ్, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఎస్బీ ఇన్స్పెక్టర్లు శ్రీధర్ గౌడ్, రాయపోల్ ఎస్ఐ రఘుపతి, దౌల్తాబాద్ ఎస్ఐ ప్రేమ్ దీప్, ఇరు పోలీస్ స్టేషన్ల సిబ్బంది, సీసీ నితిన్ రెడ్డి, పోలీస్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Kathmandu | నేపాల్లో హింస.. 100 మంది అరెస్ట్
Chilli Farming | సస్యరక్షణ చర్యలతోనే మిర్చి అధిక దిగుబడులు: డాక్టర్ ఎం వెంకటేశ్వర్ రెడ్డి
Heart Health | ఈ ఆహారాలను తింటే మీకు గుండె పోటు అసలు రాదు.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.