చేర్యాల, ఆగస్టు 2 : సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేర్గు గ్రామానికి చెందిన కొయ్యడ వెంకటయ్య(51) అనే వ్యక్తి తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ విషాదకర ఘటన మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామాని చెందిన వెంకటయ్యకు భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు. కాగా, కుమార్తెల పెండ్లిళ్లు చేసేందుకు వ్యవసాయ భూమిని విక్రయించాడు.
సాగు భూమి అమ్మాల్సి రావడంతో వెంకటయ్య మనోవేదనకు గురయ్యాడు. దీంతో క్షణికావేశానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని వెంకటయ్య భార్య బాలమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ భాస్కర్రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.