రాయపోల్ మే 09 : టీఆర్ఎస్ ముమ్మటికి రైతు ప్రభుత్వమేనని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం రాయపోల్ మండలంని అనాజీపూర్ గ్రామంలో ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సాగునీరు, నిరంతర ఉచిత విద్యుత్ సఫరాతో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధన్యతనిస్తున్నట్లు పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభిస్తున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒక్క పైసా చెల్లించకపోవడం విచారకరమన్నారు. యాసంగి ధాన్యం కోనుగోలుకు కేంద్రం నిరాకరించినప్పటికి రైతులు నష్టపోకుడదన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కోనుగోలు కేంద్రాలను ప్రారంభించారన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ కల్లూని అనిత,జడ్పీటీసీ యాదగిరి, మర్కెట్ కమిటీ చైర్మన్ పడకంటి శ్రీనివాస్ గుప్తా, మండల రైతు బంధు అధ్యక్షుడు రేకుల నర్సింహారెడ్డి,డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.