చేర్యాల, జూన్15 : దేశంలోని అన్నిరాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకపోతుందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బుధవారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని 11వ వార్డులో ఎమ్మెల్యే పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో పోరాటలతో సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతుబంధు, రైతుబీమా, ఆసరా ఫించన్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్కిట్, దళితబంధు, డబుల్బెడ్రమ్ ఇండ్ల పథకాలతో పాటు అనేక పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
ఇక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏ ఒక్కటైన బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలలో అమలవుతన్నాయా అని ప్రతిపక్ష పార్టీల నాయకులను ప్రశ్నించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని, ఇక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే బండి సంజయ్, రేవంత్రెడ్డి వంటి నాయకులు చిల్లరమల్లర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణి, కమిషనర్ రాజేంద్రకుమార్, ఏఎంసీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, వైస్ చైర్మన్ పుర్మ వెంకట్రెడ్డి, స్థానిక కౌన్సిలర్ ముస్త్యాల తార, కౌన్సిలర్లు పచ్చిమడ్ల సతీశ్, ఆడెపు నరేందర్, మంగోలు చంటి తదితరులు పాల్గొన్నారు.