-విద్యుత్ శాఖ నుంచి రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా అందజేత
సిద్దిపేట : నారాయణరావుపేట మండలం కోదండరావుపల్లి గ్రామానికి చెందిన బొంగురం శేఖర్ 2018లో వ్యవసాయ పొలం వద్ద విద్యుదాఘాతంతో మృతి చెందారు. కాగా స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి హరీశ్రావు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా స్పందించిన ఆయన విద్యుత్ శాఖ నుంచి రూ.4.50 లక్షలు మృతుడి పిల్లల పేరిట బాండ్ల రూపంలో మంజూరు చేయించడంతోపాటు మృతుడి భార్య నందినికి రూ.50 వేలు చెక్కును ఆదివారం అందజేశారు. మృతుడి పిల్లలను రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివిస్తానని ఆ కుటుంబానికి మంత్రి హరీశ్రావు భరోసానిచ్చారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం, సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్రెడ్డి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.