కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నాలుగో రోజు శనివారం ఉమ్మడి మెదక్ జిల్లాలో కట్టుదిట్టంగా అమలైంది. అత్యవసర విధులు నిర్వర్తించే వారిని అనుమతించి, అనవసరంగా రోడ్లపై తిరిగే వారిని పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ నాలుగు రోజుల్లో 2942 లాక్డౌన్ ఉల్లంఘన కేసులు నమోదు చేశారు. లాక్డౌన్ సడలింపు సమయంలో ప్రజలు తమకు కావాల్సిన సరుకులు కొనుగోలు చేశారు. ఆ సమయంలో ప్రధాన రహదారులు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, రోడ్లు నాలుగు గంటల పాటు జనంతో కిక్కిరిసి పోయాయి. ఆ తర్వాత జనం ఇంటికే పరిమితమయ్యారు. అత్యవసర ప్రయాణానికి గాను సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ మూడు జిల్లాల్లో 2643 ఆన్లైన్లో పాస్లను పోలీస్శాఖ జారీచేసింది. కాగా, సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి తన్నీరు హరీశ్రావు సూచనలతో ప్రభుత్వ దవాఖానల్లో కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ప్రైవేట్లో రెండు వేల రూపాయలకు సీటీస్కాన్ చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. లాక్డౌన్ ఉన్నప్పటికీ ఉమ్మడి మెదక్ జిల్లాలో 868 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ముమ్మరంగా సాగుతున్నాయి.
సిద్దిపేట, మే 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నాలుగో రోజు శనివారం ఉమ్మడి మెదక్ జిల్లాలో కట్టుదిట్టంగా అమలైంది. అత్యవసర విధులు నిర్వర్తించే వారిని అనుమతించి, అనవసరంగా రోడ్లపై తిరిగే వారిని పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కేసు లు కూడా నమోదు చేశారు. శనివారం సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో లాక్డౌన్ సడలింపు సమయంలో ప్రజలు తమకు కావాల్సి న సరుకులు కొనుగోలు చేశారు. ఆ సమయంలో ప్రధాన రహదారు లు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు నాలుగు గంటల పాటు జ నంతో కిక్కిరిసి పోయాయి. సరిగ్గా ఉదయం 10 గంటల సమయం కాగానే ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్ని వ్యాపార,వాణిజ్య సంస్థలను మూసి వేసి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్కు అందరూ మద్దతు తెలిపారు. ఆయా జిల్లా కేంద్రాలతో పాటు మండల కేంద్రాలు, గ్రా మాల్లో లాక్డౌన్ను ప్రజలు స్వచ్ఛందగా పాటిస్తున్నారు. కరోనా మ హమ్మారిని తరిమికొట్టాలంటే ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కా వాలని ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ విషయాన్ని ప్రజలు సూచిస్తు న్నారు. సిద్దిపేట సీపీ జోయల్ డెవిస్, మెదక్ జిల్లా ఎస్పీ చందనదీప్తి, సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి లాక్డౌన్ను పర్యవేక్షిస్తూ పోలీ సు అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. క్షేత్రస్థాయి లో పర్యటిస్తూ లాక్డౌన్ పక్కాగా అమలు అయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 10 గంటల తర్వాత ప్రజలంతా ఇంటి కే పరిమితమవుతున్నారు. అత్యవసనర పనులున్న వారు మాత్రం రోడ్డుపైకి వస్తే వారిని పోలీసులు పూర్తిగా విచారించిన తర్వాతనే అనుమతిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు వెళ్లే ఉద్యో గుల తమ కార్యాలయాల ఐడీ కార్డులను చూపితే పంపిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో 33 శాతం మంది ఉద్యోగులు రోజు వారీ గా విధులు నిర్వహిస్తున్నారు.అత్యవసర సేవలు యథావిధిగా పని చేస్తున్నాయి. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసు లు కేసులు నమోదు చేస్తున్నారు. లాక్డౌన్ ఉల్లంఘించిన వారు, లాక్ డౌన్ సడలింపు సమయంలో మాస్కులు ధరించక, సామాజిక దూరం పాటించని వారిపై ఈ నాలుగు రోజుల్లో సిద్దిపేట జిల్లాలో 188 ఐపీసీ యాక్టు కింద 670 కేసులను నమోదు చేశారు. ఈ పాస్ ద్వారా ఆన్లైన్లో 625 పాసులను జారీ చేశారు. సంగారెడ్డి జిల్లాలో సుమారుగా 2 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 1500 వరకు ఆన్లైన్లో పాస్లు ఇచ్చారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులను పెట్టి కట్టుదిట్టం చేస్తున్నారు. జిల్లా సరిహద్దులో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు 24గంటల పాటు కాపలా కాస్తున్నారు. మెదక్ జిల్లాలో ఈపాస్ల కోసం 518 మంది దరఖాస్తు చేసుకోగా, 183 పాస్లు జారీచేశారు. మెదక్ జిల్లాలో మాస్క్లు ధరించకపోవడం, సామాజిక దూరం పాటించక పోవడం, లాక్డౌన్ ఉల్లంఘించినందుకు 272 కేసులు ఇప్పటి వరకు నమోదయ్యాయి.
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన సౌకర్యాలు..
కరోనా రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సీఎం కేసీఆర్ సూచించారు.అన్ని ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన సౌ కర్యాలు కల్పిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఉమ్మడి మెదక్ జిల్లా వైద్యాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రతిరోజు కలెక్టర్లు, వైద్యాధి కారులతో మాట్లాడుతున్నారు. రోగులకు ప్రభుత్వ దవాఖానల్లో అన్నిసౌకర్యాలు అందుబాటులో ఉంచాలని సూచించడంతో పాటు అవసరమైతే తాను ఆకస్మిక తనిఖీలు చేస్తానని చెప్పారు. ప్రజలెవరూ ఇబ్బందులు పడవద్దని మంత్రి సూచించారు. కరోనా బాధితులకు భరోసా కల్పించే బాధ్యత మనందరిపై ఉందని మంత్రి అన్నారు. ప్రై వేట్ దవాఖానల్లో రెండు వేల రూపాయలకు సీటీస్కాన్ చేసేలా ప్ర త్యేక చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా జిల్లా కేంద్రాలైన సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానల్లో ఎక్కువ సంఖ్యలో బెడ్లు, ఆక్సిజన్, వెంటిలెటర్లు అందుబాటులో ఉండేలా ప్రత్యేక చర్యలు తీ సుకుంటున్నారు. రెమిడెసివిర్ ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్లో ఎవరైనా అమ్మిన వారిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ప్రత్యేకంగా ప్రతి జిల్లాకు హెల్త్ హెల్ప్ డెస్కు ఏర్పాటు చేశారు. కాగా, ప్రతి పల్లె, కాలనీ, పట్టణంలో స్థానిక సంస్థల ఆధ్వర్యంలో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. కాగా, కొవిడ్ నిబంధనలతో కూలీలను బ్యాచ్లుగా విభజించి ఉపాధి హామీ పథకం పనులను చేయిస్తున్నారు. సామాజిక పింఛన్లు, రేషన్ పంపిణీ కొవిడ్ నిబంధనలతో లబ్ధిదారులకు అందిస్తున్నారు.
ముమ్మరంగా ధాన్యం సేకరణ..
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ లాక్డౌన్ నుంచి వ్యవసాయరంగానికి మినహాయింపు ఇవ్వడంతో రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చి అమ్ముకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి రికార్డు స్థాయిలో ధాన్యం పండింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తున్నది. దీనికోసం రైతు ముంగిటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 868 ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించే విధంగా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. రైతులకు 72 గంటల్లోనే డబ్బులను నేరుగా వారి వ్యక్తిగత ఖాతాల్లో జమచేస్తున్నారు.