మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 27 : స్వామి అయ్యప్ప.. శరణం అయ్యప్ప.. మణికంఠ మందారం.. గురుస్వాములు బంగారం అంటూ కరిమళవాసుడు అయ్యప్ప స్వామిని కొలుస్తూ బుధవారం మెదక్లోని అయ్యప్ప దేవాలయంలో మండల మహాపడి పూజామహోత్సవం వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప భక్త సేవాసమాజం ఆధ్వర్యంలో కేరళ సంప్రదాయ పద్ధతిలో మహా పడిపూజ ఆలయ ప్రధాన అర్చకుడు వైద్య రాజుశర్మ, హరిదాస్ గురుస్వామి ఆధ్వర్యంలో కొనసాగింది. ఈ పూజా కార్యక్రమాల్లో మాజీ మంత్రి హరీశ్రావు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, గురు స్వాములు శ్రీకాంత్రెడ్డి, రమేశ్, కొండ శ్రీను, వెంకట నారాయణ, సత్యం, వీర్ కుమార్, రాధాకృష్ణ పాల్గ్గొన్నారు.
నర్సాపూర్, డిసెంబర్ 27 : పట్టణంలో అయ్యప్పస్వామి దేవాలయంలో కమిటీ చైర్మన్, గురుస్వాములు అశోక్గౌడ్ ఆధ్వర్యంలో మహాపడిపూజ కన్నుల పండువగా నిర్వహిం చారు. మొదటగా నర్సాపూర్ పట్టణంలోని శివాలయం నుంచి అయ్యప్ప స్వామి ఆభరణాలను అయ్యప్ప స్వామి ఆలయం వద్దకు భారీ ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఎమ్మె ల్యే సునీతాలక్ష్మారెడ్డి పాల్గొని పూజలు చేశారు. రమేశ్ గౌడ్, రాములు, నాగరాజు, దేవాగౌడ్, కరుణాకర్రెడ్డి, గోపాల్రెడ్డి, నరసింహాగౌడ్, శ్రీనివాస్గౌడ్, అయ్యప్పలు పాల్గొన్నారు.
రామాయంపేట, డిసెంబర్ 27 : పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో దొడ్డ రాకేశ్ ఆధ్వర్యంలో మహాపడి పూజ ఘనంగా నిర్వహించారు. రామాయంపేట మున్సిపల్ చైర్మన్ గురుస్వామి పల్లె జితేందర్గౌడ్, మర్కు నగేశ్, బొద్దుల సాగ ర్, మద్దెల స్వామి, సాయి తదతర స్వాములు పూజలు చేశా రు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని గురుస్వామి మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్ ప్రారంభించారు.