సిద్దిపేట : సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి లబ్దిదారులకు మంత్రి హరీశ్రావు మంగళవారం చెక్కులను పంపిణీ చేశారు. సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో 240 మంది లబ్దిదారులకు రూ.85.82 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను హరీశ్రావు అందజేశారు. ఇదే కార్యక్రమంలో 85 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
డయాగ్నస్టిక్ హబ్తో సహా అవసరమైన అన్ని యంత్రాలు, సదుపాయాలను ప్రభుత్వ ఆస్పత్రుల్లో కల్పిస్తున్నట్లు తెలిపారు. కావునా పౌరులెవరూ ప్రైవేటు ఆస్పత్రులను సందర్శించవద్దని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రతిరోజు రెండుసార్లు 300 మంది రోగులకు భోజనం అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు.