మర్కూక్(అక్టోబర్ 18) : మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎప్డీసీ చైర్మన్ ఒటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. సోమవారం మర్కూక్ మండలంలోని పాతూర్ గ్రామం పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారుల ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రాజెక్టుల్లో, చెరువుల్లో చేపపిల్లలను వదులుతున్నదని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో చెరువులకు పూర్వవైభవం వచ్చిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 80 కోట్ల చేపపిల్లలను ప్రభుత్వం ఉచితంగా పంపిణి చేస్తుందన్నారు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా మత్స్యకకారులకు ఉపాధి దొరుకుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అరుణ, ఎంపీపీ పాండుగౌడ్, జడ్పీటిసీ మంగమ్మ తదితరులు ఉన్నారు.