మద్దూరు(ధూళిమిట్ట), మే31 : విద్య, వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మంగళవారం మద్దూరు మండలంలోని సలాఖపూర్లో మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డితో కలిసి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా సర్కారు బడులల్లో మౌలిక వసతులు సమకూరనున్నట్లు తెలిపారు. మద్దూరు, ధూళిమిట్ట మండలాలలో సుమారు రూ.5కోట్లతో పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రభ్వుం దశలవారీగా అన్ని రంగాలను అభివృద్ది చేస్తుందన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా పథకాలతో పాటు వ్యవసాయానికి నిండుగా కరెంట్ను ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ శక్తివంచన లేకుండా పనిచేస్తుంటే రేవంత్రెడ్డి, బండి సంజయ్లు చిల్లర విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.