రామాయంపేట/ చేగుంట/ నిజాంపేట/ హవేళీఘనపూర్, జనవరి 14 : రామాయంపేట పట్టణంలోని పాండు చెరువు కట్టపై కల్యాణ రామచంద్ర స్వామి ఆలయంలో శని వారం గోదాదేవీరంగనాథస్వామి కల్యాణ వేడుక వైభవంగా జరిగింది. పూజారులు కూర్మాచలం సత్యనారారాయణ, రాఘవేందర్, కూర్మాచలం శ్రీనివాసచార్యులు భక్తుల సమక్షంలో రంగనాథస్వామి కల్యాణం నిర్వహించారు.
చేగుంటలోని కల్యాణవేంకటేశ్వర ఆలయంలో..
చేగుంట మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో గోదా రంగనాథస్వామివారి కల్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చేగుంటలోని కల్యాణవెంకటేశ్వరస్వామి ఆలయం లో వంశపార్యంపర్య ధర్మకర్త బచ్చు సుదర్శన్, కొండపూర్లో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గోదాదేవీరంగనాథస్వామి కల్యా ణం నిర్వహించారు. చేగుంట ఆలయంలో జరిగిన ఉత్సవా లకు ఆలయ ఆర్చకుడు వాసుదేవశర్మ, బీఆర్ఎస్ నాయకులు రంగయ్యగారి రాజిరెడ్డి, కూన రాములు, సంతోశ్, గొలి మహేశ్, రాఘవతోపాటు భక్తులు పాల్గొన్నారు.
చల్మెడలోని తిరుమలనాథ స్వామి ఆలయంలో..
నిజాంపేట మండలంలోని చల్మెడ గ్రామంలో తిరుమలనాథస్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గోదాదేవీరంగనాథస్వామి కల్యాణాన్ని నిర్వహించారు. భక్తు లు కల్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు దంపతులు, చల్మెడ ఎంపీటీసీ బాల్రెడ్డి, తిరుమలనాథ ఆలయ కమిటీ చైర్మన్ మహేశ్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు భాస్కర్రావు, పురోహితులు శ్రీహర్ష, వాసుశర్మ, కృష్ణాచార్యలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కూచన్పల్లిలోని కూచాద్రి వేంకటేశ్వరాలయంలో..
హవేళీఘనపూర్ మండల పరిధిలోని కూచన్పల్లి కూచాద్రి వేంకటేశ్వరాలయంలో గోదాదేవీరంగనాథ స్వామి కల్యాణోత్సవాన్ని పూజారి నవీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
చిట్కుల్లో ముగిసిన చాముండేశ్వరీ వార్షికోత్సవాలు
మండలంలోని చిట్కుల్ గ్రామ శివారులో మంజీరా నదితీరాన వెలిసిన చాముండేశ్వరీ ఆల య వార్షికోత్సవాలు శనివారం ముగిశాయి. ఉత్సవాలకు హై దరాబాద్, సంగారెడ్డి, మెదక్, ఇతర రాష్ర్టాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 51 మంది వేద పండితులు సప్తశక్తి, అఖండ జ్యోతి కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అమ్మవారికి కుంకుమార్చన చేసి, ఒడిబియ్యం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో అర్చకులు ప్రభాకర్శర్మ, మోతీలాల్శర్మ, సుబ్రహ్మణ్యంశర్మతోపాటు ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి, చిట్కుల్ సర్పంచ్ గోపాల్రెడ్డి, చాముండేశ్వరీ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
పెద్దచింతకుంటలోని జలహనుమాన్లో ప్రత్యేక పూజలు
మండలంలోని పెద్దచింతకుంట గ్రామ సమీపంలో జలహనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూ జలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఉత్సవాల్లో ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్చారి, భక్తులు పాల్గొన్నారు.
అర్చకుడికి కానుకల అందజేత
30 రోజులుగా ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో పూజలు చేస్తున్న పూజారి నల్లదిహాల్ వెంకటరమణాచార్యులుకు భక్తులందరూ కలిసి రూ.28వేల నగదు, బంగారు ఉంగరాన్ని అందజేశారు.
రామాయంపేట వేంకటేశ్వరస్వామి ఆలయ నిధికి భక్తుడు కొత్త శ్రీనివాస్, పద్మ దంపతులు రూ.51,120 నగదును విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ లక్ష్మీపతి, సభ్యులు లక్ష్మణ్, అశోక్, మధు ఉన్నారు.