చేగుంట, మార్చి 2 : మెదక్ జిల్లా చేగుంట మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఎన్నం రాజేందర్రెడ్డి కాంగ్రెస్లో చేరారు. శనివారం నార్సింగిలోని చంద్రారెడ్డి గార్డెన్లో దుబ్బాక కాంగ్రెస్ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్రెడ్డి సమక్షంలో రాజేందర్రెడ్డితో పాటు పలు పార్టీలకు చెందిన పలువురు కాంగ్రెస్లో చేరారు.