సిద్దిపేట, ఏప్రిల్ 11 : సిద్దిపేటలో 20ఏండ్లుగా ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లింలను అలయ్బలయ్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం ఎక్బాల్మినార్ వద్ద ఈద్గా మైదానంలో ప్రార్థనలు నిర్వహించిన అనంతరం మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్, కడవేర్గు రాజనర్సులతో కలిసి వేడుకల్లో పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ మీ జీవిత ఆశయాలు నెరవేరేలా అల్లా ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
శాంతి, ప్రేమ, పవిత్ర సంకల్పానికి చిహ్నం రంజాన్ అన్నారు. ఈ రోజు ముస్లింలతో కలిసి పండుగలో పాలుపంచుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్రెడ్డి, నాయకులు పాల సాయిరాం, మచ్చ వేణుగోపాల్రెడ్డి, కౌన్సిలర్లు మల్లికార్జున్, మోయిజ్, ఆక్తర్పటేల్, మెహన్లాల్, సికిందర్, కోఆప్షన్ సభ్యుడు మేర సత్తయ్య, జావిద్, రజనీకాంత్రెడ్డి, రెడ్డి ప్రభాకర్రెడ్డి, మేర్గు మహేశ్, మరుపల్లి శ్రీనివాస్ గౌడ్, ఇర్షాద్ హుస్సేన్, జువ్వన్న, కనకరాజు, ముస్లింలు తదితరులు పాల్గొన్నారు.